ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాలనతో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్న సంగతి తెలిసిందే. పాదయాత్రలో ఇచ్చిన ఎన్నో సంక్షేమ పథకాలను సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన సమయం నుంచి ఒకొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు. 

                                  

ఇది అమలు చేసే క్రమంలో ఎంతో మంది నిరుపేదలకు తన పథకాలతో సహాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో అవినీతి అనేది ఉండకూడదు అని అనేక కార్యక్రమాలు చేపడుతూ.. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం జగన్. ఈ క్రమంలోనే అవినీతి జరిగితే టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చెయ్యాలని నిన్న విడుదల చేశారు. 

                               

ఇలా రాష్ట్రంలో పారదర్శక పరిపాలన అందిస్తున్న సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ సౌకర్యాలు ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు ఆంధ్రాలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి డేట్ ను కూడా సీఎం జగన్ ఇప్పటికే ఫిక్స్ చేసేశారు. 2020 జనవరి 26న ఆంధ్రాలో కొత్తజిల్లాలు ఏర్పడనున్నాయి.

                                

ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా ఏర్పడే జిల్లాల పేర్లు హిందూపురం, రాజంపేట, తిరుపతి, నంద్యాల, విజయవాడ, నరసాపురం, రాజమండ్రి, అరకు, అనకాపల్లి, నరసరావుపేట, అమలాపురం, బాపట్ల ఈ జిల్లాలు అన్ని కొత్తగా రానున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: