మూడు రోజుల క్రితం హైదరాబాద్ బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ దగ్గర కారు ప్రమాదం గురించి తెలిసిందే. ఈ ఘటనలో ఓ మహిళ చనిపోగా.. మరి కొంతమందికి గాయాలయ్యాయి. వీరిలో అనంతపురం జిల్లాకు చెందిన కుబ్రాబేగం అనే యువతి కూడా తీవ్రంగా గాయపడింది. ఆమె వెన్నెముకకు తీవ్ర గాయంకావడంతో ఆస్పత్రిలో చేర్చారు. యువతికి త్వరగా ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పగా.. అందుకోసం ఐదు లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. కానీ ఆ కుటుంబానికి అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో.. దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.

 

యువతి తండ్రి అబ్దుల్ అజీం సహాయం కోసం ఎదురుచూస్తుండగా.. స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డికి విషయం తెలిసింది. దీంతో వెంటనే సమాచారాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. యువతి ఆరోగ్య పరిస్థితి.. సాయం కోసం ఎదురు చూస్తుందని తెలియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పెద్ద మనసు చాటుకున్నారు. ఆస్పత్రిలో వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న యువతికి అడంగా నిలిచారు. ప్రభుత్వం తరపున సాయం అందించి.. తన మానవత్వాన్ని చాటుకున్నారు. వైద్యానికి అయ్యే ఖర్చుకు సంబంధించి ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. 

 

వెంటనే యువతికి సంబంధించిన సమాచారం సేకరించాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ హరికృష్ణను రంగంలోకి దించారు. యువతి వివరాలు సేకరించి.. ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు మొత్తాన్ని సీఎం రిలీజ్ ఫండ్ నుంచి విడుదల చేయాలని నిర్ణయించారు.
బయో డైవర్సిటీ ప్రమాదంలో గాయపడ్డ బాధితురాలు కుబ్రా బేగంకు ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. 

 

ప్రభుత్వం తరపున సీఎం సహాయ నిధి నుంచి తక్షణ సహాయం కింద రూ.3,60,000 మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే యువతి మామూలు స్థితికి వచ్చేవరకు అండగా నిలుస్తామని కూడా హామీ ఇచ్చారుసమస్య తెలిసిన ఉంటనే అండగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి.. యువతి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ హరికృష్ణ, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి చేసిన సాయాన్ని మర్చిపోలేమన్నారు. కష్టాల్లో ఉన్న సామాన్యులకు అండగా నిలిచిన సీఎం జగన్‌పై ప్రశంసలకు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: