మనిషి ప్రవర్తనలో తేడా ఉంటుందేమో, అతని రూపులో వివిధ ఆకారాలు కనిపిస్తాయెమో కాని కనిపించకుండా మనిషిని భ్రష్టున్ని చేసి అతను ఉన్న స్దానాన్ని కూడా దిగజార్చే మహా మాయలాడి కోరిక. ఈ కామం ఒంట్లో పుట్టిందంటే వావివరసలు చూడదు. పరిసరాలను గ్రహించదు.

 

 

అసలు తానొక మనిషిని అనే జ్ఞనాన్ని కూడా మసిబార్చి, ఎంతకు దిగజారుస్తుందంటే, అప్పటివరకు అతనిపై ఉన్న గౌరవం, సమాజంలోని విలువ అన్నీటినీ పాతాళంలో తొక్కేస్తుంది. ఇలాంటి నీచపు ఆలోచనలకు అతితులు ఎవరు కారు. దానికి నిదర్శనమే ఇక్కడ జరిగిన సంఘటన. నిత్యం భగవంతుని సేవలో నిమగ్నమైన ఓ పూజారి ఒక్క సారిగా చేయకూడని తప్పును చేసాడు. తన మనసును నియంత్రించుకోకుండా అంతవరకు పొందిన పుణ్యాన్ని ఒక్క చెడు ఆలోచనతో, నీచపు ప్రవర్తనతో పోగొట్టుకున్నాడు.

 

 

నిత్యం పూజాది కైంకర్యాలు నిర్వహించే ఆ అర్చకుడు దేవుడి సన్నిధిలోనే భక్తురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాలు తెలుసుకుంటే. గుంటూరు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం గ్రామంలో ఉన్న ఓ ఆలయంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. వైకుంఠపురం గ్రామంలో ఉన్న ఆలయానికి  స్వామివారి దర్శనార్థం విజయవాడకు చెందిన దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం వచ్చారు.

 

 

సంతాన ప్రాప్తి కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అర్చకుడి పాదాలకు నమస్కరించే సమయంలో, సంతానం కలగాలంటే మహిళతో ఒంటరిగా మాట్లాడాలని, అప్పుడే కోరిక నెరవేరుతుందని ఆ అర్చకుడు వారికి మాయమాటలు చెప్పి, ఆ మహిళను దైవసన్నిధిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించసాగాడు. ఆ మహిళ ప్రతిఘటించి, తప్పించుకొని బిగ్గరగా అరుస్తూ బయటకు పరుగెత్తిరాగా. అర్చకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అప్రమత్తమైన కుటుంబసభ్యులు విషయాన్ని గ్రామస్థులకు చెప్పి వెళ్లిపోయారు. ఈ ఉదంతంపై దేవాదాయ శాఖ అధికారులు గోప్యంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: