'హృదయ కాలేయం' సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు ఇటీవలే 'కొబ్బరి మట్ట' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి రచ్చరంబోలా చేశాడు. ఆగష్టు 10న విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్లతోనే దూసుకుపోయింది. ఆ సినిమా హిట్ తో అప్పుడప్పు ప్రేక్షకులకు కనిపిస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సంపూర్ణేష్ బాబుకు ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 

                

సంపూర్ణేష్‌ బాబుతో పాటు ఆయన కుటుంబసభ్యులకు ఈరోజు రోడ్డు ప్రమాదంలో తృటిలో ప్రమాదం తప్పింది. సిద్ధిపేటలో సంపూర్ణేష్‌ బాబు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆర్టీసీ బస్సు 'ఢీ'కొట్టింది. ఈ ప్రమాదంలో సంపూర్ణేష్‌ బాబుతో సహా ఆయన భార్య, కుమార్తెకు స్వల్పంగా గాయాలు అయ్యాయి. ఇందుకు సంబంధించి పూర‍్తి వివరాలు తెలియాల్సి ఉంది.

                  

 అయితే తెలంగాణాలో తాత్కాలిక డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా రోజు రోజుకు ప్రమాదాలు చాల ఎక్కువ అయిపోతున్నాయి. తృటిలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంకా నిన్నటికి నిన్న హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో సాఫ్ట్ వెర్ ఉద్యోగిని ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టి ఆమె తలపైనే బస్సు పోవడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. 

 

ఇంకా ఆర్టీసీ సమ్మె ప్రకటించాక ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. ఒకటా రెండా ? వరుసగా గత 50 రోజులుగా జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ విధుల్లోకి తీసుకోవడం లేదు. ఒకవైపు వారు అందులోనా చేస్తున్నప్పటికీ ఇటువైపు ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్లు వారి చేతి వాటాన్ని ప్రజలకు రుచి చూపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి ఈ ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: