తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో పర్యటన చేశారు. ఈ పర్యటనలో చంద్రబాబు ఘోర అవమానాలపాలయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల్లో టిడిపి పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మొదటి సారి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అమరావతిలో పర్యటించారు.
ఈ నేపథ్యంలో రాజధాని టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే గతంలో రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి భూములు సేకరించిన చంద్రబాబు రైతులకి ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారు. దీంతో చంద్రబాబుని రాజధానిలో పర్యటించవద్దు అంటూ అమరావతి రైతులందరూ నల్ల బ్యాడ్జీలు ఫ్లెక్సీలతో నిరసన వ్యక్తం చేశారు. అంతేకాకుండా అమరావతి పర్యటన ప్రారంభంలోనే చంద్రబాబు కాన్వాయిపై చెప్పులు, కర్రలు, రాళ్ళూ విసిరారు.
దీంతో రాజధాని అమరావతిలో మరింత టెన్షన్ నెలకొంది. 70 ఏళ్ళ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చెప్పులు విసిరారు అది కూడా పేడ చెప్పు. కొంచంలో మిస్ అయ్యింది. అయితే ఆ చెప్పులు రైతులే విసిరార ? లేక చంద్రబాబే తనపై వేయించుకున్నాడా అనే విధంగా చంద్రబాబు పర్యటన సాగింది నేడు. అయితే ఇంత టెన్షన్ టెన్షన్ వాతావరణంలో కూడా చంద్రబాబు రాజకీయ నాటకం చేశారు అంటే చుడండి.
అది ఏదో తన జన్మ భూమి అయినట్టు.. అక్కడ ఏదో సాధించునట్టు చంద్రబాబు అమరావతి నెల ముద్దు పెట్టుకున్నారు. ఆ ముద్దులు పెట్టుకోవడం ఒక ఎత్తు అయితే చంద్రబాబు ఫోటోలు ట్విట్టర్, ఫేస్ బుక్ లో పెట్టి మరో రాజకీయ కామెడీ చేశాడు. అయితే ట్విట్టర్ లో పెట్టిన ఈ ఫోటోలపై సంచలన కామెంట్లు వచ్చాయి. ఎందుకయ్యా నీకు ఈ కష్టం అని ఒకరు అంటే మరొకరు 70 ఏళ్ళ వయసులో ఇలా వంగితే మళ్ళి లేయగలవా చెప్పు అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.
అయితే మరి కొందరు మాత్రం చంద్రబాబు ఈ రాజకీయం యాక్టింగ్ పై వ్యంగ్యాస్త్రాలు కురిపించారు. కొంచెం చూడు పవన్.. యాక్టింగ్ అంటే ఇలా ఉండాలి.. ఎప్పుడు ఆవేశంతో కూడిన నటన కాదు, అప్పుడప్పుడు సెంటిమెంట్ కూడా చూపించాలి.. అని ఒకరు కామెంట్ చేస్తే మరొకరు 'ఈ ఓవర్ యాక్షన్ వల్లే నీకు 23 సీట్లు వచ్చాయి' అంటూ సెటైర్లు వేశారు.. మరి కొందరు .. ఎన్టీఆర్ అప్పట్లో అన్న మాటలు గుర్తు చేశారు. 'చంద్రబాబు నాకన్నా పెద్ద నటుడు' అని ఎన్టీఆర్ మాటలను గుర్తు చేశారు. ఏమైతేనేం ఈరోజు చంద్రబాబు తన నటస్వరూపాన్ని అమరావతి ప్రజలకు.. ట్విట్టర్ తో ప్రపంచానికి చూపించారు.
these overactions are gave you 23 seats ...if you continue like this ....it will come to 2 or 3 seats ...
— Maruthi Reddy (@ReddySRM) November 28, 2019