పవన్ కళ్యాణ్ పై సినీ విమర్శకుడు కత్తి మహేష్ రెచ్చిపోయారు. గతంలో ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ బ్రోకర్ అని సామాజిక జోకర్ అని విమర్శించిన కత్తి మహేష్ తాజాగా పవన్ కళ్యాణ్ పై మరోసారి రెచ్చిపోయారు. "ఈ సారి నీకు గుండు గీయడం కాదు ఇంట్లోకి దూరి కొడతా" అంటూ పవన్ పై ఘాటుగా స్పందించారు కత్తి మహేష్. 

 

ఏళ్ళ తరబడి తమ రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని, నీటి విషయంలో రాజధాని విషయంలో మా ప్రాంత వాసుల్ని గత ప్రభుత్వాలు నమ్మించి మోసం చేశాయని, జగన్ ప్రభుత్వం మా ప్రాంత వాసుల్ని అభివృద్ధి చేయాలని చూస్తుంటే ఇడుపులపాయలో రాజధాని కట్టుకోమంటూ పవన్ ఎద్దెవా చేస్తే చూస్తూ ఊరుకోను, మా ప్రాంత అభివృద్ధికి అడ్డం రావాలని చూసిన,  మా రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేసే విధంగా మాట్లాడితే ఈసారి నీకు గుండు గీయడం కాదు ఇంట్లోకి దూరి కొడతా అంటూ పవన్ కు వార్నింగ్ ఇచ్చారు కత్తి మహేష్. 

 

తనపై కోడి గుడ్డు దాడి చేసిన వారిని పవన్ ఇంటికి పిలిచి మరీ భోజనం పెట్టారని ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు చేయాల్సిన పనేనా ఇది అని ప్రశ్నించారు కత్తి మహేష్. పవన్ కి ఒక సొంత ఎజెండా అంటూ లేదు చంద్రబాబు చెప్పినట్లు ఆడుతారు, టీడీపీ రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతారు నీకు ఎక్కడ ఉంది సొంత ఎజెండా అంటూ పవన్ ని ప్రశ్నించారు కత్తి మహేష్. విశాఖపట్నం లో జరిగిన లాంగ్ మార్చ్ కి స్క్రీన్ ప్లే డైరెక్షన్ చంద్రబాబు ది కాదా?,  దమ్ముంటే లాంగ్ మార్చ్ కి జన సమీకరణ ఎవరు చేసారో బయటపెట్టాలని సవాల్ విసిరారు కత్తి మహేష్. 

 

తన వెనుక వైసీపీ ఉండి ఇదంతా చేయిస్తోంది అనే విమర్శకు సమాధానం చెప్తూ, వైసీపీకి నాకు ఏమాత్రం సంబంధం లేదు. అయినా అధికారంలో ఉన్న వైసీపీ కి తనలాంటి చిన్న స్థాయి వ్యక్తులతో పనేముంటుంది అని ప్రశ్నించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: