జర్మనీకి చెందిన జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్షే. భారత్లోనూ తన మార్కెట్ను విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా భారత్లో ఈ ఏడాది ఆరంభంలో ‘911 కార్రెరా ఎస్’ ‘911 కార్రెరా ఎస్ కాబ్రియోలెట్’ పేరుతో రెండు అధునాతన కార్లను ప్రవేశపెట్టింది. వెనుక ఇంజిన్ కలిగిన ఈ మోడల్ కార్లు అధునాతనంగా రూపుదిద్దుకుని ఆటో మొబైల్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఇక విడుదలైన విలాసవంతమైన ఈ స్పోర్ట్స్ కారు ధరల్లో రూ.1.82 కోట్లు కాగా.. మరో కారు ధర రూ.1.99 కోట్లుగా కంపెనీ ప్రకటించింది. ఇకపోతే ఇలాంటి విలాసవంతమైన పోర్షే కారుతో వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఓ వ్యక్తికి భారీ షాక్ తగిలింది. సరైన పత్రాలు, నంబర్ ప్లేట్ లేని కారణంగా అతడి కారును ఆర్టీవో అధికారులు స్వాధీనం చేసుకుని, ఏకంగా రూ. 9.8 లక్షల మేర జరిమానా విధించారు. గుజరాత్లో జరిగిన ఈ ఘటన వివరాలు తెలుసుకుంటే...
అహ్మబాద్లోని హెల్మెల్ క్రాస్రోడ్ వద్ద బుధవారం సిల్వర్ కలర్ పోర్షే కారు(911 స్పోర్ట్స్ కారు)ను ట్రాఫిక్ పోలీసులు ఆపారు. నంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణించడంతో పాటు సరైన పత్రాలు లేకపోవడంతో కారును కాసేపు అక్కడే నిలి కారుకు సంబంధించిన సమాచారాన్ని చెక్ చేయగా జరిమానాలు లక్షల్లో పేరుకు పోయినట్లు గుర్తించారు. అప్పటివరకు ఉన్న అన్నీ జరిమానాలు కలిపి దాదాపు 10 లక్షల రూపాయల విధించి.. చలానా చెల్లించిన తర్వాతే కారును తీసుకెళ్లమని చెప్పడంతో కారు యజమాని బిక్క ముఖం వేశాడు.
కాగా ఇప్పుడు నెటిజన్లు ‘అమ్మో ఈ జరిమానాతో మరో కారును కొనుక్కోవచ్చు. బహుశా ఇదే అతిపెద్ద భారీ జరిమానా అనుకుంటా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ ఘటన గురించి అహ్మదాబాద్ డీఎస్పీ మాట్లాడుతూ... మోటారు వాహన చట్టం ప్రకారం కారును అదుపులోకి తీసుకున్నట్లు, కారు నడుపుతున్న వ్యక్తికి ఆర్టీవో మెమో ఇచ్చామని పేర్కొన్నారు. కారు యజమాని పూర్తిగా బకాయిలు చెల్లించిన తర్వాతే కారును అతడికి అప్పగిస్తామని వెల్లడించారు..