మనిషి మానవతా విలువలని కోల్పోతున్నాడు. విచక్షణా రహితంగా ప్రవర్తిస్తున్నాడు. బంధం అనుబంధాలు వాయి వరసా అనేవి ఏవీ లేకుండా మానవ మృగాళ్ళలా ప్రవర్తిస్తున్నారు. ఇకపోతే పెళ్ళి చేసుకుని పెట్టింటి నుంచి మెట్టినింట్లో అడుగుపెట్టిన కోడలికి తల్లి తండ్రి అవ్వవలసిన అత్తమామలే ఆమె పాలిట పాలిట యమపాశకాలయ్యారు. మామ అంటే తండ్రి స్థానంలో ఉండి కోడలిని కాపాడాల్సింది పోయి క్రూరుడుగా మారాడు. కాటికి కాళ్లు చాపుకున్న వయస్సులో కామ కోరికలతో రెచ్చిపోయాడు. కన్న కొడుకు చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు. భార్య కాలం చేయడంతో ఇతర మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా కూతురిలా చూడాల్సిన కోడలిపైనా కన్నేశాడు. కొడుకు లేని సమయంలో తన కోరిక తీర్చాలంటూ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో కొడుకు చేతిలో హతమయ్యాడు.
యాద్రాద్రి జిల్లా భువనగిరి మండలంలోని బండసోమారం గ్రామానికి చెందిన ఏమల్ల లక్ష్మారెడ్డి, రాధమ్మ దంపతులకి ఓ కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. చిన్న కుమారుడు ఆరేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోగా.. కూతురుకి వివాహమై అత్తింట్లో ఉంటోంది. పెద్ద కుమారుడు మాధవరెడ్డి మనస్పర్థలతో మొదటి భార్యకు విడాకులిచ్చేసి.. 4 సంవత్సరాల క్రితం మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే వృద్ధాప్యంలో ఉన్న లక్ష్మారెడ్డి పరాయి స్త్రీలతో వివాహేతర సంబంధం పెట్టుకొన్నారు. ఈ క్రమంలోనే కొడుకు లేని సమయంలో కోరిక తీర్చాలంటూ కోడలిని వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పడంతో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది.
దీంతో మాధవరెడ్డి భార్యతో వేరు కాపురం పెట్టాడు. అయినప్పటికీ పద్ధతి మార్చుకోని లక్ష్మారెడ్డి అప్పుడప్పుడు వారి ఇంటికి వెళ్లి కోడలిని వేధిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే మాధవరెడ్డి మూడెకరాల పొలంలో సాగుచేసిన ధాన్యాన్ని స్థానిక రామస్వామిగుట్ట పై ఆరబోశారు. శుక్రవారం ఆ గుట్టపైకి మాధవరెడ్డి వెళ్లగా అతడి తండ్రి మరో మహిళతో రాసలీలలు కొనసాగిస్తూ కనిపించాడు. ఈ వయస్సులో ఇలాంటి పనులేంటని తండ్రిని నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే మాధవరెడ్డి తండ్రిని గెంటేయడంతో బండరాయిపై పడి తల పగిలి చనిపోయాడు.