హైదరాబాద్ షాద్నగర్ సమీపంలో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి అత్యాచారం హత్య ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. మానవ మృగాల్లాంటి  నలుగురు మగాళ్లు  అమాయకపు ఆడపిల్లని అతి దారుణంగా అత్యాచారం చేశారు అనంతరం హత్య చేసిన ఘటన అందరినీ కలిచివేసింది. ప్రియాంక రెడ్డి అత్యాచార హత్య కేసు నిందితులకు ఉరిశిక్ష పడాలి అంటు  దేశం మొత్తం నినదిస్తోంది. వీ వాంట్  జస్టిస్ అంటూ ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తమవుతున్నాయి.నిర్భయ  లాంటి కఠిన చట్టాలను తీసుకు వచ్చిన తర్వాత కూడా మహిళలపై అత్యాచారాలు జరగడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.కాగా  ప్రియాంక రెడ్డి హత్య ఉదంతం ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం. 

 

 

 

 ప్రియాంక రెడ్డి హత్య పై టిక్ టాక్ ద్వారా అందరికీ సుపరిచితమైన ఉప్పల్ బాలు స్పందించారు. ప్రియాంక రెడ్డి అత్యాచారం హత్య ఘటన జరిగి రెండు రోజులు అవుతుంది. ఇప్పుడు వరకు నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. నిందితులను అరెస్టు చేసి జైల్లో పూజ చేసి టెంకాయ కొడతారా అంటూ నిలదీశారు ఉప్పల్ బాలు . ఒక అమాయకపు అమ్మాయి పట్ల అంత క్రూరంగా గురించిన వాళ్లను ఉరి తీయకుండా... టీవీలలో వాళ్లను చూపిస్తూ షోలు నిర్వహిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఉప్పల్ బాలు. ఇలాంటి కామందులను ప్రజల ముందుకు తీసుకు వస్తే నిందితులను అక్కడికక్కడే ప్రజలందరికీ అడ్డంగా నరికివేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా చేస్తేనే మరోసారి ఎవరైనా ఇలా చేయాలంటే భయపడతారు అంటూ వ్యాఖ్యానించారు. 

 

 

 

 అత్యాచారం హత్య చేసిన నిందితులను టీవీలో ఎంతసేపు చూడాలని ఆయన అన్నారు. నిందితులకు ఉరిశిక్షను పడానికి ధర్నాలు చేయాలా అంటూ వ్యాఖ్యానించారు. నిందితులను బయటకు తీసుకు వస్తే వాళ్ళ గొంతు పిసికి చంపేయాలి అన్నంత కోపం వస్తుందని... జనాలు వాళ్ళని  తొక్కి పారేస్తారని అన్నారు ఉప్పల్ బాలు. ఆ నిందితులను  చూస్తుంటేనే రక్తం మరుగుతోంది. చంపితేనే తనకు మనశ్శాంతి కలుగుతుంది అని తెలిపాడు. రేప్ చేయాలని ఎవరికైనా ఆలోచన వస్తే ఇంత  ఘోరంగా చంపుతారా అనేంత ఘోరంగా నిందితులను  చంపాలంటు  ప్రియాంక రెడ్డి  అత్యాచారం హత్య ఘటనపై తన ఆ ఆగ్రహాన్ని  వెళ్లగక్కాడు ఉప్పల్ బాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: