గరుడ పురాణం శివాజిగా పాపులరైన హాస్యనటుడు  శొంఠినేని శివాజీ ఇపుడెక్కడున్నాడు ? ఇదే విషయం ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇటు సినిమాల్లోనూ లేడు. అటు మీడియాలో కూడా ఎక్కడా కనబడటం లేదు. మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి దెబ్బకు గూబగుయ్యిమన్నట్లే శివాజికి కూడా అలాగే మాడు పగిలిపోయిందేమో ?

 

దాదాపు ఏడాదిన్నర క్రితం గరుడ పురాణం పేరుతో శొంఠినేని ఎంత యాగీ చేసింది అందరికీ గుర్తుండే ఉంటుంది.  లేని పురాణాన్ని ఉన్నట్లుగా జరగని పరిణామాలను జరుగుతున్నట్లుగా చిత్రీకరించి జనాలను జగన్ కు వ్యతిరేకంగా రెచ్చగొట్టటానికి ఈ హాస్యనటుడు చాలానే అవస్తలు పడ్డారు. కానీ ఎంత అరిచి గీ పెట్టినా శివాజీని జనాలు తీసివతలపారేశారు.

 

చంద్రబాబునాయుడు, ఎల్లోమీడియా అండ్ కో కలిసి జగన్ కు వ్యతిరేకంగా శివాజిని రంగంలోకి దింపారన్న విషయం అందరికీ తెలిసిపోయింది. సరే చంద్రబాబుకు అనుకూలంగా జనాల మైండ్ సెట్ ఎంత మార్చాలని ప్రయత్నం చేసినా ఉపయోగం కనబడలేదు. దాంతో శివాజి అడ్రస్ లేకుండా పోయారు. వైసిపి అఖండ మెజారిటితో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి శివాజి గొంతు ఎక్కడా వినబడటం లేదు.

 

అప్పటికే టివి 9 యాజమాన్యం బదిలీ వ్యవహారంలో  తనపై నమోదైన కేసులో అరెస్టు కాకుండా  తప్పించుకుని తిరుగుతున్నాడు. అరెస్టు భయంతో విదేశాలకు పారిపోయాడని ప్రచారం జరిగింది. తాను ఎక్కడికి పారిపోలేదని తొందరలోనే మీడియా ముందుకొస్తానంటూ ఓ వీడియో సందేశం మాత్రం పంపారు. అయితే ఇప్పటి వరకూ మళ్ళీ ఎక్కడా కనబడలేదు.

 

అయితే అమెరికాకు వెళిపోతున్నాడన్న సమాచారంతో పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో ఆమధ్య పట్టుకున్నారు. మళ్ళీ ఏమైందో తెలీలేదు. చివరకు పోలీసుల విచారణకు కూడా సహకరించటం లేదనే ప్రచారం మాత్రం జరుగుతోంది. మొత్తానికి జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడాలంటేనే భయపడిపోతున్నట్లు కనిపిస్తోంది. బహిరంగంగా కనబడితే పోలీసులో లేకపోతే ఇంకెవరైనా వాయించేస్తారన్న భయంతోనే అండర్ గ్రౌండ్లో ఎక్కడా తలదాచుకున్నట్లు  అనుమానంగా ఉంది. మొత్తానికి గరుడపురాణం శివాజి అడ్రస్ అయితే ఎక్కడా దొరకటం లేదన్నది వాస్తవం.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: