దేశవ్యాప్తంగా.. హైదరాబాద్ లో ఒక అమ్మాయిపై అత్యాచారం, హత్య జరిగిందని ఒకవైపు అందరూ అయ్యే పాపం అనుకుంటూ.. కంటితడి...పెట్టుకుంటున్నారు. ఇకనుంచి అయిన ఏ అమ్మాయి పైన దాడి జరగకుండా షాద్ నగర్ నిందితులకు ఉరిశిక్ష విధించి..బయట ఉన్న కామాంధులకు తప్పు చేస్తే ఇటువంటి పరిస్థితే వస్తుందని తెలియజేసేలా ప్రభుత్వాన్ని చేయమంటూ భారతదేశం అంతా ర్యాలీలు చేస్తున్నారు. ఇంకా.. బాధితురాలుకు న్యాయం జరగాలంటూ ప్రార్థిస్తున్నారు. ఇలా దేశం మొత్తం పుట్టెడు విషాదంలో ఉంటె.. మరొకవైపు మాత్రం కొంతమంది కామంతో కళ్ళు మూసుకుపోయి.. సిగ్గు శరం లేకుండా కనపడిన అమ్మాయినల్లా అత్యాచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అటువంటి కామాంధుడు గురించే మనం ఈ ఆర్టికల్ లో తెలుసుకోపోతున్నాం.


వివరాల్లోకి వెళితే... ఒక 14 ఏళ్ల మైనర్ బాలిక హన్మకొండలోని ఒక హాస్టల్ లో ఉంటూ చదువుకుంటుంది. అయితే తన కంటి పై కురుపులు అయ్యాయని చికిత్స కోసం శనివారం రాత్రి..సమీపంలో ఉన్న ఒక ఆర్ ఎం పి డాక్టర్ వద్దకు వెళ్ళింది.. అయితే ఈ క్రమంలోనే.. చికిత్స చేస్తానని చెప్పి... ఆ ఆర్ఎంపీ వైద్యుడు ఆ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ...మానభంగం చేయబోయాడు.



దాంతో భయభ్రాంతులకు గురైన ఆ గిరిజన బాలిక... అక్కడి కామాంధుడి వలలో నుంచి తప్పించుకొని...గట్టిగా కేకలు వేస్తూ.. హాస్పటల్ నుంచి బయటికి పరుగులు తీసింది. అలా పరుగులు తీస్తూ తన హాస్టల్ కి వెళ్లిన బాలిక.. ఆమె అమ్మకు ఫోన్ చేసి.. జరిగిన విషయం అంతా చెప్పి ఏడ్చింది. ఈ విషయం తెలుసుకున్న.. పక్క గ్రామంలో నివసిస్తున్న తన తల్లి సుబేదారి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అతనిపై ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు ఫోక్సో చట్టం కింద అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆదివారం రోజు అతనిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: