గత కొన్ని రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ ను ప్రతి విషయంలో టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ విమర్శలపై స్పందించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ మతిభ్రమించి నట్లు మాట్లాడుతున్నాడని మంత్రి అనిల్ కుమార్ అన్నారు . టీడీపీ అధినేత చంద్రబాబు ని ఫాలో అవడం లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హచ్  కుక్కను మించిపోయాడు అంటూ మంత్రి అనిల్ ఎద్దేవా  చేశారు. అందుకే రాష్ట్ర ప్రజలందరూ పవన్ కళ్యాణ్ ని...  పవన్ నయుడు,  కళ్యాణ్ నాయుడు అంటున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సెటైర్ వేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను  రాజకీయ నాయకుడు అనాలా లేక నటుడు అనాలో తనకు అర్థం కావడం లేదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. 

 

 

 

 రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దమ్ము ధైర్యం గురించి రాష్ట్ర ప్రజలకు తెలుసునని పవన్ కొత్తగా చెప్పాల్సిన పని లేదు అంటూ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పవన్ కళ్యాణ్ సత్తా ఏంటో మొన్నటి ఎన్నికల్లోనే తెలిసిందంటూ ఆయన ఎద్దేవా చేశారు. తమ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎలా పిలిచినా తమకు అవసరం లేదని... పవన్ను  పట్టించుకునే వారు ఎవరూ లేరు అంటూ ఆయన అన్నారు. తమకు మెరుగైన పాలన అందుతుందనే  నమ్మకంతో ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్... కుల మతాలు లేవని పవన్ నిత్యం అవే మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. 

 

 

 

 సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోయి మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. సోషల్ మీడియాలో రెచ్చిపోయి మాట్లాడతారు నీ ఫాన్స్ ని కంట్రోల్ చేసుకో అంటూ ఆయన హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ వల్ల ఏదీ సాధ్యం కాదని అన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్... ఎవరితోలు,  తాట  తీయలేరు  అని అన్నారు. దేవుడు నోరు ఇచ్చాడు అని చెప్పి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. 2017 లో జరిగిన ఘటనను పవన్  మాపై రుద్దుతున్నాడు అని... అప్పుడు పవన్ నిద్ర పోయాడా అంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: