ఏపీలో జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మద్య నిషేధమే తమ లక్ష్యమని చెబుతున్న ప్రభుత్వ మరోసారి మద్యం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక దశలవారీ మద్య నిషేధం చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా ఇప్పటికే మద్యం షాపులను గణనీయంగా తగ్గించింది. ఇంతటితో ఊరుకోకుండా ధరలను అమాంతం పెంచేసింది. అయితే ఈ సారి మద్యం ధరలను భారీగా వడ్డించింది. క్వార్టర్ బాటిల్కి రూ.60, ఫుల్ బాటిల్కి రూ.240లు పెంచేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యంపై అదనపు పన్ను విధించడం తో ధరల పెంపు అనివార్యమైనట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు..
ఇకపోతే విదేశీ మద్యం 50-60 ఎంఎల్పై రూ. 30, విదేశీ మద్యం 200-275 ఎంఎల్ మీద రూ.60, విదేశీ మద్యం 330-500 ఎంఎల్ మీద రూ.120, విదేశీ మద్యం 700 - 750 ఎంఎల్పై రూ.240, విదేశీ మద్యం 1500/2000 ఎంఎల్ మీద రూ. 750 చొప్పున పెరగనున్నాయని తెలిపారు. ఇదే కాకుండా భారత్లో తయారైన విదేశీ మద్యం ధరలను ఒక సారి పరిశీలిస్తే 60 ఎంఎల్, 90 ఎంఎల్ మీద రూ. 30 చొప్పున పెరగనుండ గా. భారత్లో తయారైన విదేశీ మద్యం 180 ఎంఎల్ పై రూ. 60, భారత్లో తయారైన విదేశీ మద్యం 375 ఎంఎల్పై రూ.120, భారత్లో తయారైన విదేశీ మద్యం 750 ఎంఎల్ పై రూ.240, భారత్లో తయారైన విదేశీ మద్యం 1000 ఎంఎల్ పై రూ.300, భారత్లో తయారైన విదేశీ మద్యం 2000 ఎంఎల్ రూ. 750 చొప్పున పెరగనున్నాయని సమాచారం..
ఇదే కాకుండా బీరు ప్రియులకు కూడా చుక్క చుక్క గొతులో దించుకునేలా బీరు ధరలను భారీగా పెంచింది. వీటి ధరలు ఎలాగున్నాయంటే బీర్ 330 ఎంఎల్పై రూ.30, బీర్ 500 ఎంఎల్పై రూ.30, బీర్ 650 ఎంఎల్పై రూ. 60, బీర్ 30,000 ఎంఎల్పై రూ. 3,000, బీర్ 50,000 ఎంఎల్పై రూ. 6,000 లు గా పెంచాలని నిర్ణయించారట.. ఇక ‘రెడీ టు డ్రింక్’ బ్రాండ్లు అన్నింటిపై రూ.60 చొప్పున పెరగనున్నాయి. ఇక శుక్రవారం నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయని అధికారులు తెలుపుతున్నారు.