దిశ ఘటనలో నిందితులను ఆత్మరక్షణ నిమిత్తం పోలీసులు తప్పనిసరై ఎన్కౌంటర్ చేసి చంపేశారు. అరెస్టయిన రోజు నుంచి వారి క్రూరత్వం మాత్రం అనువంతైనా తగ్గలేదు. జైలులో ఉన్న సమయంలో కూడా వారు తప్పు చేశారని ఎటువంటి పశ్చాత్తాపం చూపలేదు. వారి ప్రవర్తన, ఇంకా వారు ఇచ్చే సమాధానాలను చూసి అక్కడి చర్లపల్లి జైల్లో ఉన్న పోలీసులే విస్తుపోయారు. అమాయకురాలైన దిశను కిరాతకంగా చంపిన ఆ నలుగురిని ఎన్కౌంటర్ కాకుండా ఇంకా కఠినమైన శిక్ష ఇచ్చినట్లయితే బాగుండని ప్రజలందరూ ఒకవైపు అంటుంటే... రేపిస్టు తల్లిదండ్రులు మాత్రం వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.

ఇక చెన్నకేశవ తల్లి మాటలు వింటే ఎవ్వరికైనా రక్తం సలసల మరిగిపోతుంది. ఇటువంటివారి పెంపకం లోనే రేపిస్టులు, దొంగలు తయారవుతారు అని స్పష్టమౌతుంది. ఒక బిడ్డ తప్పు చేస్తుంటే, దొంగతనం చేస్తుంటే... తప్పని చెప్పాల్సిన తల్లిదండ్రులే వారిని ప్రోత్సహిస్తూ ఉంటారు. మద్యం తాగడం, అమాయకులైన ప్రజలపై గొడవపడటం ఇంకా వారి పిల్లల ముందు చెడుగా ప్రవర్తించడం వలనే కదా వాళ్ళ బిడ్డలు అవి చూసి కఠినంగా మారుతున్నారు.

ఆమె ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం.. " ఎవర్నడిగి ఎట్లా జరుపుతారు? న్యాయం లేదా? అన్యాయంగా ఇప్పుడు చంపిండ్రు. ఆ నలుగురే చేశారా రేప్? రేప్ చేసిన వాళ్లు వంద మంది ఉన్నారు జైల్లో. జైల్లో ఎంతమంది తింటున్నారు! అటువంటప్పుడు ఈ నలుగుర్ని ఎట్లా చంపుతారు? తెలవకుండా తీసుకపోయి ఎవరికి తెలియకుండా చంపినారు. ఆ పిల్ల(చెన్నకేశవులు భార్య) మొహం చూడండి... ఏడు నెలల కడుపుతో ఉన్నది. ఆ పిల్ల జీవితాన్ని నిలపెట్టండి. ఎట్ల చంపారు మీరు... కోర్టు చెప్పిందా? న్యాయం వచ్చిందా.. మరీ ఎట్లా చంపారు. పోయిన ల* అయితే తిరిగిరాదు. మా బిడ్డను మాకు తెచ్చియండి. లేకపోతే.. ఆ పిల్లను కూడా (చెన్నకేశవులు భార్య) చంపేయండి' అంటూ పిచ్చి పిచ్చి గాా   మాట్లాడింది. దీంతో ఆమె తీరుపై నెటిజన్లు మండి పడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: