వెటర్నరీ డాక్టర్ 'దిశ' హత్య కేసులో నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన ఘటనపై దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ, ఇతర ప్రముఖులు స్పందిస్తున్నారు. యావత్ భారత దేశం తెలంగాణా పోలీసులను అభిమ్నందిస్తున్నారు. పూలతోను అలాగే పాల్భిషేకాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ ఘటనపై స్పందించారు. ఒక ఆడపిల్ల తండ్రిగా ఎన్‌కౌంటర్‌‌ను సమర్థిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఒక్క ఏపి నుండే కాదు అన్నీ రాష్ట్రాల నుండి ప్రతీ ఒక్క మంత్రులు, నాయకులు ఏపి పోలీసులను అభినందిస్తున్నారు. వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని అంటున్నారు. 

 

ఇకపై అన్ని పాఠశాలలు, కళాశాలల్లో ఆడపిల్లల‌కు మార్షల్స్ ఆర్ట్స్ నేర్పించాలని కోరారు. దిశకు జరిగిన అన్యాయం ఏ ఆడపిల్లకు జరగకూడదని భావోద్వేగంతో మాట్లాడారు. ఇటువంటి ఘటనలు జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా చట్టాలను మార్చి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని మంత్రి అవంతి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ప్రతి పురుషుడు మహిళలకు అండగా ఉండాలని సూచించారు. మహిళల పట్ల మగవాళ్ళు ఎప్పుడైతే బాధ్యతగా వ్యవహరిస్తారో తన సొంత ఆడపడుచులా భావిస్తారో అప్పుడు ఇలాంటి నీచన సంఘటనలు జరగవని తెలిపారు.

 

హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ హత్య కేసులో నిందితులను శుక్రవారం తెల్లవారు జామున పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. దిశను సజీవదహనం చేసిన చోటే అత్యాచార ఘటనను రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేయడంతో అప్రమత్తమైన పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ఘటనలో అక్కడికక్కడే నిందితులు మృతి చెందారు. దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ నిర్ధారించారు. శుక్రవారం తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు ఆయన వెల్లడించిన సంగతి తెలిసిందే. దిశ హత్య కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారని తెలిసిన మరు క్షణమే దిశ కు ఇదే సరైన న్యాయం అంటూ ప్రజలందరు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: