హైదరాబాద్ షాద్నగర్ లో అమాయకపు వైద్యురాలైన దిశను నలుగురు నిందితులు అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన విషయం తెలిసిందే. దిశా ఘటన ఒక్కసారిగా దేశం మొత్తం వ్యాపించి... దేశం మొత్తం దిశా ఘటనపై స్పందించిన నిరసనలు తెలిపిన తెలిపింది. డిల్లీ లో జరిగిన నిర్భయ ఘటన తర్వాత దేశం మొత్తానికి చేరిన ఘటన ఇదొక్కటే. ఎట్టి పరిస్థితుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడాలంటు  డిమాండ్ చేసింది దేశ ప్రజానీకం. నిందితులకు ఉరిశిక్ష వేసి మరోసారి ఆడపిల్లలపై అఘాయిత్యాలు చేయాలి అంటేనే  భయపడాల్సిన పరిస్థితి తేవాలంటూ నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు దిశ కేసులోని నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేసి చంపారు . 

 

 

 

 అయితే దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ పై  పలువురు సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా  వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే . అయితే తాజాగా దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్పై కన్నడ నటుడు ఉపేంద్ర ట్విట్టర్ వేదికగా స్పందించారు . కాగా ప్రస్తుతం కన్నడ నటుడు ఉపేంద్ర పెట్టిన ట్వీట్ దుమారం రేపుతోంది. దిశ నిందితుల ఎన్కౌంటర్ వెనుక ఎవరైనా ప్రముఖుల హస్తం ఉందేమో అన్నట్లుగా ఉపేంద్ర ట్విట్  పెట్టినట్లు తెలుస్తోంది. నిజంగా నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఎక్కడా ఆధారాలు లేవంటూ ఉపేంద్ర ట్వీట్ చేశారు. ప్రముఖ వ్యక్తుల కేసుల్లో  ఇలాంటి ఎన్కౌంటర్లు ఎందుకు జరగడం లేదంటూ ప్రశ్నించారు ఉపేంద్ర. 

 

 

 

 హైకోర్టులో విచారణ జరగకముందే ఎన్కౌంటర్ చేసి వాళ్ళను చంపడం సరికాదంటూ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఒకప్పుడు రౌడీయిజాన్ని తక్కువ చేసేందుకు ఎన్కౌంటర్లు జరిగాయి అని గుర్తు చేశారు ఉపేంద్ర. నిజాయితీ గల పోలీస్ అధికారులు మనసు పెడితే... ఎన్కౌంటర్లు చేయడం ద్వారా అత్యాచారాలను నివారించవచ్చు అంటూ తెలిపారు. ఎన్కౌంటర్ లను ప్రముఖులు,  శ్రీమంతులు దుర్వినియోగం చేయకుండా చూడాలని ఆయన అన్నారు. అయితే ప్రస్తుతం ఉపేంద్ర పెట్టిన ట్వీట్ దుమారం రేపుతోంది. కొంత మంది నెటిజన్లు ఉపేంద్ర ట్విట్  పై కామెంట్ చేస్తున్నారు. రాజకీయ పార్టీని పెట్టిన వ్యక్తి బాధ్యతాయుతంగా మాట్లాడాలని కామెంట్ చేస్తున్నారు. కొంతమంది ఉపేంద్ర కు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: