దేహనికి అయిన గాయంకు కొద్దిరోజులు మందిస్తే మాని పోతుంది. కాని హృదయానికి అయిన గాయం మానాలంటే చాల సమయం పడుతుంది. శంషాబాద్‌లో జరిగిన ఘటన కూడా ఇప్పుడు ఇలాగే మారింది. నిందితులు హత్యాచారం చేయడం. అరెస్ట్ అవడం. ఆ తర్వాత ఎన్‌కౌంటర్‌లో మరణించడం ఇదంతా సినిఫక్కిలో జరిగిందంటున్నారు. కాని దీని తాలూకూ ప్రభావం మాత్రం ఇప్పట్లో తగ్గేలా లేదు. ఇకపోతే ఈనెల 6వ తేదీన జరిగిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్ మీద తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం  ఈ ఎన్‌కౌంటర్‌ పై విచారణ చేపట్టనుందని తెలుస్తుంది.

 

 

తెలంగాణలో దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి జాతీయ మానవహక్కుల కమిషన్ హైదరాబాద్‌లో పర్యటిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది... ఇకపోతే ఏడుగురు సభ్యులతో కూడిన ఈ సిట్ రాచకొండ సీపీ మహేష్ భగవత్ నేతృత్వంలో ఏర్పాటైంది. ఇందులో వనపర్తి ఎస్పీ అపూర్వ రావు, మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, రాచకొండ ఎస్‌ఓటీ డీసీపీ సురేందర్, సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్, రాచకొండ ఐటీ సెల్ శ్రీధర్ రెడ్డి, కోరుట్ల సీఐ రాజశేఖర్ రాజు, సంగారెడ్డి డీసీఆర్‌బీ సీఐ వేణుగోపాల్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు...

 

 

ఇక దిశ హత్యాచారం డిసెంబర్‌ 27న జరుగగా, ఈనెల 6వ తేదీన నిందితులు ఎన్‌కౌంటర్ గావించబడ్డారు.. ఇదెలా జరిగిందంటే దిశను దారుణంగా తగులబెట్టిన ప్రదేశానికి నలుగురు నిందితులను ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం పోలీసులు విచారించేందుకు తీసుకుని వెళ్లారు. తెల్లవారుజామున ఆ ప్రదేశానికి చేరుకున్న నిందితులు తమ వద్ద ఉన్న తుపాకులను లాక్కుని వారి మీద రాళ్లతో దాడి చేశారని సైబరాబాద్ సీపీ సజ్జనార్ చెప్పారు. ఈ క్రమంలో నిందితులు కాల్పులు కూడా జరపడంతో పోలీసులు ప్రాణరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో నలుగురు నిందితులు చనిపోయారని తెలిపారు. ఇకపోతే ఈ ఘటన పై సమగ్ర విచారణ జరుపాలని ఇప్పటికే మానవహక్కుల సంఘం ఏర్పాటల్లో ఉంది. కాగా తెలంగాణ ప్రభుత్వం తాజాగా  సిట్ ఏర్పాటు చేయడం కొందరిని ఆశ్చర్యపోయేలా చేస్తుందట ?

మరింత సమాచారం తెలుసుకోండి: