ఈ మద్య దేశ వ్యాప్తంగా మహిళలపై కామాంధులు రెచ్చిపోతున్నారు. ఎక్కడ చూసినా ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. అయితే మహిళపై కృర మృగాళ్లా రెచ్చిపోతున్న కామాంధులకు కఠినమైన శిక్షలు విధించాలని దేశ వ్యాప్తంగా మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. నిర్భయలాంటి కఠిన చట్టాలను తీసుకు వచ్చినా.. దేశంలో మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. హైదరాబాద్ శివారులో వెటర్నరీ డాక్టర్ దిశను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి ఆ పై హత్య చేసిన నలుగురు దుండగులను 24 గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా ఆ నలుగురు దుండగులు పోలీసులపై తిరగబడటంతో ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు జరిపిన ఈ ఎన్కౌంటర్పై యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తుంది. నిందితులకి తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు సరైన శిక్ష విధించారని ప్రతి ఒక్కరు చెబుతున్నారు.
ఇలాంటి న్యాయమే తమకు కావాలని ఎంతో మంది బాధితులు ప్రభుత్వాలను నిల దీస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ దుర్మార్గురాలు తల్లి అనే పదానికి మచ్చ తెచ్చిన సంఘటన హృదయాలన కదిలించి వేస్తుంది. కన్న కూతురిపై జరుగుతున్న అఘాయిత్యం గురించి తెలిసి తల్లి నిందితులకే సహకరిస్తూ అమ్మ అనే పదానికే మాయని మచ్చ తెచ్చింది. కాగా, సంవత్సరం కాలంగా 12ఏళ్ల బాలికపై ముగ్గురు కామాంధులు ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. గుజరాత్లోని భావ్నగర్ జిల్లాలోని పటితానా తాలుకా భుటియా గ్రామానికి చెందిన ఓ మహిళకు ముగ్గురు వ్యక్తులతో అక్రమ సంబంధం ఉంది...వారితో ప్రతిరోజూ కామక్రీడలో మునిగిపోయేది.
ఈ క్రమంలోనే వారి కన్న 12 ఏళ్ల ఆమె కూతురిపై పడింది. ఈ క్రమంలోనే భర్త ఇంట్లో లేని సమయంలో ఆ ముగ్గురితో తన కూతురుని బలవంతంగా అత్యాచారం చేయించింది. గత ఏడాదిగా ముగ్గురు కామాంధులు ఆ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు పెట్టే హింస భరించలేక ఆ అమ్మాయి తన తండ్రితో జరిగిన విషయాన్ని చెప్పింది. వెంటనే తన కుమార్తెపై అత్యాచారానికి ఒడిగట్టేవారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితురాలి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు ఆ ముగ్గురితో పాటు బాలిక తల్లిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.