అమ్మాయిల వెంట అబ్బాయిలు ప్రేమించమని వెంటపడడం కామన్. కానీ అది ముదిరి తేనే కాస్త సమస్య వస్తుంది. ఈ మధ్య ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రేమించాలని వెంటపడడం లేకపోతే బెదిరింపులకు పాల్పడటం . యువతి తన ప్రేమను అంగీకరించలేదని కోపంతో ఏకంగా యువతిపై యాసిడ్ పోయడం చంపడం లాంటివి జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ప్రేమ పేరుతో వెంట పడుతున్న యువకులు.. తాము ప్రేమిస్తున్న అమ్మాయి తమను ప్రేమించడం లేదు అని తెలియడంతో సైకోలు గా మారిపోతున్నారు. ఆ తర్వాత ఇష్టారీతిన ప్రవర్తిస్తూ మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎక్కడ ఇలాంటి ఘటన జరిగింది.

 

 

 

 ఏకంగా తనను యువతీ  ప్రేమించలేదని కదులుతున్న బస్సులోనే తాళి కట్టేస్తాడు ఇక్కడ ఓ ప్రబుద్ధుడు. ఇక ఆ తర్వాత ఆ యువతి కేకలు వేయడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఆ ప్రబుద్దున్ని  పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తమిళనాడు రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని అంబూరు సమీపంలో సాండ్రోర్  కుప్పం కి చెందిన జగన్ ఓ యువతిని ప్రేమించాడు . అయితే ఇద్దరూ ఒకే కళాశాలలో చదువుతున్నప్పటికీ జగన్ మాత్రం తన ప్రేమ విషయాన్ని ఆ యువతికి ఇప్పటివరకు చెప్పలేదు. 

 

 

 

 ఇటీవలే ఆ యువతికి వివాహం నిశ్చితమైనది . కాగా ఈ విషయం తెలిసిన జగన్...  తాను ప్రేమిస్తున్నట్లు ఆ యువతికి వెంటనే వెళ్లి  తన ప్రేమ విషయం చెప్పేసాడు. అయితే  యువతీ మాత్రం తనకు పెళ్లి నిశ్చయం అయిపోయిందని... ప్రేమించలేను అంటూ సున్నితంగా తిరస్కరించింది. దీంతో జగన్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయాడు . నిన్న ఉదయం యువతి బస్సులో ఆంబూరు  నుంచి వానియంబాడీకి  బస్సులో వెళ్తుంది. ఇక జగన్ కూడా అదే బస్సు ఎక్కాడు. ఒక బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో తాను ప్రేమించిన యువతిని కూర్చున్న సీటు వద్దకు వెళ్లి ఒక్కసారిగా ఆమె మెడలో తాళి కట్టేసాడు జగన్ . దీంతో విస్తుపోయిన ఆ యువతి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు నిందితుని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: