ఆంధ్ర ప్రదేశ్ లో పప్పు గోల ఎక్కువ అయిపోయింది. ఏంటి అనుకుంటున్నారా ? సరే విషయంలోకి రండి. ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సుపుత్రుడు.. మాజీ మంత్రి.. తెలుగుదేశం పార్టీ నేత.. ప్రస్తుతం ఎమ్మెల్సీ.. ట్విట్టర్ పిట్టా నారా లోకేష్ ఈరోజు ఆంధ్ర ప్రజలకు మంచి చేసే సీఎంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 

ఏంటి అనుకుంటున్నారా ? ఇంకేంటి అంది అదే... ఈరోజు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరుగుతున్నాయి టీడీపీ నేతలు అందరూ నిరసనకు దిగారు కదా!! అక్కడే నారా లోకేష్ కూడా హాజరై ''నేను పప్పు అయితే సీఎం జగన్ గన్నేరు పప్పు'' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే తాను పప్పు అని ఒప్పుకున్నట్టే కదా.. 

 

అంతటితో ఆగలేదు.. అదే విషయాన్నీ ట్విట్టర్ లో తీసుకొచ్చి పెట్టాడు నారా లోకేష్.. ఏంటి అనుకుంటున్నారా ? అదేనండి ట్విట్టర్ లో ఇలా ట్విట్ చేశాడు ట్విట్టేష్.. ''నన్ను ఎగతాళి చేస్తున్న వైసీపీ నేతలు, వైసీపీ పెయిడ్ బ్యాచ్ లు... ఈ వీడియో చూసి మీ నాయకుడికి నేను పెట్టిన పేరు కరెక్టా? కాదా? చెప్పండి.'' అంటూ ట్విట్ చేశాడు. 

 

ఈ ట్విట్ చుసిన నెటిజన్లు.. ఎంతకు దిగజారిపోయావు సామి. ఇంకొకరిని పప్పు చేస్తే నువ్ పప్పు కాకుండా పోవు. నువ్ ఇప్పటికీ మా పప్పువే... 'అవును ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసావు ఏంటి మంగళగిరి అని పలకడానికి.' అని ఒకరు కామెంట్ చేస్తే.. మరొకరు స్పందిస్తూ.. ''నువ్వు అయితే ముద్దపప్పు.. అల్ ధీ బెస్ట్ ఫర్ టుమారో అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు'' అంటూ ట్విట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ట్విట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: