ఈ మధ్య అత్యాచారాలు మరి మితిమీరిపోతున్నాయి.. అబ్బాయిల బుద్ధులు మరి దారుణంగా ఉన్నాయి. ఆడది ఒంటరిగా కనిపిస్తే అత్యాచారం... సజీవదహనం. ఆడదాని వరుకు ఎందుకు ఆడపిల్ల అంటే చిన్నపిల్ల కనిపించిన చాలు అత్యాచారం చేసి చంపేస్తున్నారు. అయితే ఈ ఘటనలు ఒక్క ఆడవారిపైనే కాదు.. 

                      

మన చుట్టూ తిరిగే పశువులపైనా.. కుక్కలపైన.. పిల్లులపైన అన్నింటిపైనా అత్యాచారాలు చేస్తున్నాయి ఈ మగమృగాలు. అయ్యో అంతెందుకు అండి.. మగడు అందంగా ఉంటె మగాడిపై కూడా అత్యాచారం జరుపుతున్నారు ఈ నీచులు. ఇలా అబ్బాయిపై అత్యాచారం చేసిన ఘటన నిజంగా ముంబైలో జరిగింది.  

                              

ఇంకా వివరాలలోకి వెళ్తే.. ముంబైలో 22 ఏళ్ళ యువకుడిపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం ఓ రెస్టారెంట్ వద్ద బాధితుడు సెల్ఫీ దిగి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చెయ్యగా.. అతడి ఫోలీవర్స్ లో ఉన్న నలుగురు వ్యక్తులు అడ్రస్ ను ట్రేస్ చేసికలుసుకున్నారు, ఆ తర్వాత యువకుడిని బలవంతగా కారులోకి ఎక్కించి కారులోనే మూడు గంటలు అత్యాచారం చేశారు. 

                                

అత్యాచారం అనంతరం ఆ బాధితుడిపై పెట్రోల్ పోయగా అక్కడి నుండి పారిపోయి ఓ చోటా దాక్కున్నాడు. లేకపోతే అతన్ని అక్కడే సజీవదహనం చేసి చంపేసేవారు. అయితే బాధితుడు తప్పించుకోవడం వల్ల తాజాగా ఈ కేసులోని నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ కేసుకు సంబంధిచిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: