ఇప్పుడున్న పరిస్దితుల్లో ఒక్క భార్యనే పోషించడం చాలా కష్టం అలాంటిది ఇద్దర్ని చేసుకుని సాదాలంటే తాతలు సంపాధించిన మూటలు ఉంటే కొంతవరకైనా ఇబ్బంది లేకుండా గడపవచ్చూ. ఇకపోతే లోకంలో ఆడవారిపై జరుగుతున్న దారుణాలు రోజు రోజుకు మనకు కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తూనే ఉన్నాయి. అమ్మాయిలు తెలివిగా ఉంటారనుకుంటారు. కాని గొర్రెలు కసాయివాన్ని నమ్మినట్లుగా ఉండి ఉండి మూర్ఖున్నే ఎక్కువగా నమ్ముతారు. తర్వాత పొందవలసిన నష్టాన్ని పొందుతారు.

 

 

ఇకపోతే ఈ మధ్యకాలంలో కట్నం గొడవలు కూడా చాలా వినిపిస్తున్నాయి. అమ్మాయి ఉద్యోగస్తురాలైనా కూడా అదనంగా కట్నం కావాలనే వేధింపులు చాలా జరుగుతున్నాయి. ఇక్కడ ఓ ఘనుడు అదనపు కట్నం కోసం ఎంత పని చేసాడో తెలుసుకుందాం. బిహార్‌లోని కతిహార్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ముఖేశ్ షా అనే వ్యక్తికి 2012లో ఓ యువతితో వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం కూడా కలిగారు.

 

 

అయితే ముఖశ్ కుటుంబం పెళ్లి సమయంలో రూ.5లక్షలు డిమాండ్ చేయగా.. వధువు తరఫువారు కట్నంగా రూ.3లక్షలు మాత్రమే ఇచ్చారు.. కట్న పిశాచిలా మారిన ముఖశ్ పెళ్లయినప్పటి నుంచి అదనపు కట్నం కోసం భార్యను వేధించేశాడు. అలా సాగుతున్న వారి కాపురంలో సంతానం కూడా కలిగింది.. ఇక ఇటీవల అతడు సరిగ్గా ఇంటికి రాకపోవడంతో పాటు అతని ప్రవర్తనలోనూ తేడా కనిపించడం తో భార్య నిఘా పెట్టగా తెలిసిన విషయానికి షాకవ్వడం ఆమె వంతైంది..

 

అదేమంటే ముఖశ్ కొంతకాలం క్రితమే రెండో పెళ్లి చేసుకుని, మరోచోట కాపురం పెట్టినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో తన జీవితాన్ని ఎందుకు నాశనం చేశావంటూ ఆమె భర్తను నిలదీయగా, దీనికి అతడు చెప్పిన కారణంతో ఆమె మరోసారి షాకైంది. ఇక అతను చెప్పిన విషయం ఏంటంటే తనకు పెళ్లి సమయంలో రూ.2లక్షలు తక్కువగా కట్నం ఇచ్చారని,

 

 

ఆ డబ్బు కోసమే మరో యువతిని పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడు. దీంతో బాధితురాలు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి భర్తపై మోసం, వరకట్న వేధింపుల కింద ఇదే కాకుండా అదనపు కట్నం తెస్తేనే ఇంట్లో అడుగుపెట్టాలని అత్తమామలు సైతం వేధిస్తున్నారని కేసు పెట్టింది.. కాగా కేసు ఇప్పుడు దర్యాప్తులో ఉందట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: