హాజీపూర్.. ఈ ఊరి పేరు వినగానే వణుకు పుడుతుంది. ఎందుకంటే ఓ సైకో ముగ్గురు మైనర్ ఆడపిల్లలను అత్యాచారం చేసి హత్య చేసి భూమిలో పతిపెట్టేసాడు. మాములు కిల్లర్ కాదు ఆ నిచుడు సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డి. ఈ కేసు ఆ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు విచారణ త్వరలోనే ముగియనుంది. ఈనెల 29, 30 తేదీల్లో ఈ కేసు విచారణకు సంబంధించి తీర్పు రానుంది. 

 

ఇంకా వివరాల్లోకి వెళ్తే.. హాజీపూర్‌ నల్గొండ జిల్లా బొమ్మలరామారం బ్లాక్‌లో చిన్నగ్రామం.. ఈ గ్రామంలో కొన్ని నెలల క్రితం ముగ్గురు మైనర్ బాలికలు వరుసగా మాయమయ్యారు. ఇలా మాయం అవ్వడం విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. అయితే ఈ మార్చిలో తొమ్మిదో తరగతి చదువుతున్న అమ్మాయి అదృశ్యమైంది. స్పెషల్‌ క్లాసుకు వెళ్తున్న అని చెప్పిన ఆ మైనర్ బాలిక ఆతర్వాత తిరిగి ఇంటికి రాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఫలితం లేదు. అయితే చివరగా ఆమె.. అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డితో ఉండడాన్ని గమనించిన కొందరు వ్యక్తులు.. ఆ విషయాన్ని పోలీసులకు తెలపాగా వారు శ్రీనివాస్‌రెడ్డిని విచారించారు. దీంతో ఆ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. 

 

శ్రీనివాస్‌ రెడ్డి అనే నిచుడు డ్రగ్స్‌కు బానిసై అమ్మాయిలు పిచ్చితో మైనర్ బాలికలకు మాయమాటలు చెప్పి వర్రీని ప్రేమ అనేదానిలోకి లాగి వారిని ఆ ప్రాంతంలోని బావి దగ్గరకు తీసుకెళ్లి అత్యాచారం జరిపి హత్య చేసేవాడు. అయితే మొదట ఒక అమ్మాయిని చంపి, బావిలో పడేసిన శ్రీనివాస్ రెడ్డి తర్వాత, మరింత రెచ్చిపోయి మరో ఇద్దరు మైనర్లను అదే తరహాలో హత్య చేశాడు. శ్రీనివాసరెడ్డిని అక్కడికి తీసుకెళ్లగా అతను చూపించిన బావిలో ఓ మృతదేహం, రెండు అస్థిపంజరాలు లభించాయి. ఈ ఘటన తెలుసుకున్న స్థానికులు ఒక్కసారిగా షాక్ లో ఉండిపోయారు..  అయితే ప్రస్తుతం ఈ నిచుడు జైల్లో ఉండగా.. తాజాగా జరిగిన దిశ ఎన్కౌంటర్ తో ఈ ఘటన మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నెల 29, 30 తేదీల్లో వెలువడే తీర్పు ప్రకారం ఈ నిచుడు ఉంటాడా ? పోతాడా అనేది తెలుస్తుంది. అయితే దిశ నిందితులను ఎన్కౌంటర్ చెయ్యగా ఈ సైకో శ్రీనివాస్ రెడ్డిని కూడా ఎన్కౌంటర్ చెయ్యాలని పోలీసులు ఫీజ్ అయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: