సమాజంలో మనుషులు అమ్మ కడుపు నుండి బయటకు వచ్చి లోకాన్ని చూస్తున్నామనే విషయాన్ని మరచిపోతున్నట్లుగా ఉన్నారు. ఒక పశువు కడుపున పుట్టిన పశువులు కూడా ఇంత నీచంగా ప్రవర్తించవు. ఇప్పుడున సమాజంలో మేము మనుషులము అని చెప్పుకునే వారు పందుల కంటే హీనంగా బ్రతుకుతున్నారనిపిస్తుంది. ఎందుకంటే రోజు రోజుకు పెరుగుతున్న ఆత్యాచారాలను చూస్తుంటే. కన్నుమిన్ను కానక కామం ఒక్కటే సంతృప్తిని ఇస్తున్నట్లుగా బ్రతికేస్తున్నారు లోకంలోని మనుషులు.

 

 

ఇకపోతే మరో కామాంధుడు కామంతో కళ్లు మూసుకుపోయి నిండు గర్భిణిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రూరల్‌ సీఐ శ్రీనివాసరావు కథనం ప్రకారం.. కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలానికి చెందిన మహిళ కుటుంబం కొన్నేళ్లుగా కరీంనగర్‌ మండలం బొమ్మకల్‌ గ్రామంలో నివాసం ఉంటోంది. ఆమె భర్త సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 9వ త్యేది మధ్యాహ్నం డిష్‌ రిపేర్‌ పేరిట మహిళ ఇంట్లోకి వచ్చిన కనపర్తి రామకృష్ణ ఆమె ఒంటరిగా ఉన్న విషయన్ని గమనించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఆమె మెడలోని పుస్తెల తాడు తెగిపోయింది.

 

 

ఇది జరిగిన కాసేపటికి సదరు మహిళ భర్త ఇంటికి రాగానే పుస్తెలు మళ్లీ కట్టుకుంటూ, బట్టలు చిందరవందరగా పడి ఉన్న ఆమెను చూసి అనుమానంతో ఏమైందని  అడుగగా జరిగిన అఘాయిత్యం గురించి చెప్పింది. అయితే ఈ విషయం బయటకు తెలిస్తే తమ పరువు పోతుందని ఆలోచించిన వారు చివరకు సోమవారం కరీంనగర్‌ రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడు కనపర్తి రామకృష్ణపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

 

ఇదిలా ఉండగా ఆ మగమృగాడు అత్యాచారం చేసిన సమయంలో తన సెల్‌ఫోన్‌ ద్వారా వీడియో చిత్రీకరించాడని మహిళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా ఇన్ని రకాలుగా మహిళలపై అత్యాచారాల విషయంలో మీడియా గాని పోలీసులుగాని ప్రచారం కలిపిస్తున్న, చట్టం కఠినమైన చట్టాలు అమలు చేస్తున్నా ఇంకా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమైన విషయంగా పేర్కొనవచ్చూ..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: