ఇటీవల కొద్దిరోజులుగా మన దేశంలో అమాయకమైన అమ్మాయిలపై క్రూరంగా జరుగుతున్న అత్యాచారాలు నిజంగా ప్రజలందరినీ ఎంతో కలవర పెడుతున్నాయి. కొన్నాళ్ల క్రితం జరిగిన నిర్భయ ఘటన తరువాత ఒకింత చట్టాల్లో మార్పులు చేసిన ప్రభుత్వం, కొద్దిపాటి కఠిన శిక్షలు అమలు చేస్తున్నప్పటికి కూడా ఈ దురాగతాలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికీ కూడా అక్కడక్కడా కొందరు మృగాళ్లు ఈ రకమైన దుశ్చర్యలకు దిగుతున్నారు. ఇక ఇటీవల హైదరాబాద్ లోని షాద్ నగర్ ప్రాంతం వద్ద గల తొండుపల్లి టోల్ గేట్ వద్ద యువ లేడీ డాక్టర్ ప్రియాంక రెడ్డి రేప్ మరియు హత్య ఘటన మన దేశ వ్యాప్తంగా ఎంతో సంచలనం రేకెత్తించింది. 

 

ఆమెను నలుగురు నీచులు పక్కా ప్లాన్ ప్రకారం అటకాయించి, ఆపై ఆమెను ఈడ్చుకెళ్లి ఘోరంగా అత్యాచారం చేసారు. అంతటితో ఆగని ఆ నీచులు ఆమెను చంపేసి, ఆపై పెట్రోల్ పోసి ఆమెను తగులబెట్టారు కూడా. హృదయ విదారకమైన ఈ ఘటనను వింటుంటే ఎవరికైనా గుండె తరుక్కుపోక మానదు. నిందితులను 24 గంటల్లో పట్టుకున్న పోలీసులు, ఘటన అనంతరం వారం రోజుల తరువాత కేసు రి కన్స్ట్రక్షన్ సందర్భంగా నిందితులు నలుగురిని ప్రియాంకను హత్య చేసిన చోటికి తీసుకెళ్లగా, సడన్ గా వాళ్ళు పోలీసులపై రాళ్లు రువ్వి పారిపోబోతుండడంతో, అప్రమత్తమైన పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. కాగా ఆ ఎన్కౌంటర్ లో నలుగురు నిందితులు కూడా అక్కడికక్కడే మరణించారు. 

 

దానితో దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేసారు. కాగా ఈ దారుణ ఘటనపై ఇటీవల పూర్తి వివరాలు సేకరించిన ఫోరెన్సిక్ బృందం వారు, ఒక సమూల రిపోర్ట్ ని తయారు చేసి కోర్ట్ సీల్డు కవరులో సమర్పించినట్లు తెలుస్తోంది. కాగా ఆ కీలక రిపోర్ట్ లో ప్రియాంక నోట్లో బలవంతంగా మద్యం పోసిన ఆనవాలు తోపాటు ఆమె ఒంటి పై ఉన్న పలు గాయాల గుర్తులు సహా, ఘటన తాలూకు పూర్తి వివరాలను పొందుపరిచినట్లు సమాచారం. కాగా ఆ రిపోర్ట్ రాగానే ఈ ఘటనలో పూర్తి నిజానిజాలు బయటకు రానున్నాయి......!!

మరింత సమాచారం తెలుసుకోండి: