లోకం ఎటువైపు పయణిస్తుందో అర్ధం కావడం లేదు. మనుషులుగా బ్రతకమని మన పూర్వికులు మంచి సమాజాన్ని ఏర్పాటు చేస్తే, ఆ సమాజంలో దుష్టులు, నీఛులు, కామాంధులు తయారు అయ్యి భ్రష్టుపట్టిస్తున్నారు. రోజు రోజుకు జరుగుతున్న అఘాయిత్యాలపై ఒకవైపు ప్రజలు, మరో వైపు చట్టం సీరియస్ అవుతూ నిందితులను శిక్షిస్తుంటే ఎవరికి కనీసం ఒంట్లో భయం కూడా కలుగడం లేదు. జరిగే ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. చేయవలసిన పాడు పనులు చేస్తూనే ఉన్నారు..

 

 

ఇకపోతే అతివలపై జరిగే కీచక పర్వం పూర్తిగా సమసి పోవాలంటే మాత్రం ప్రత్యేక శ్రద్ద పెట్టవలసిన అవసరం ఉందనిపిస్తుంది... ఇప్పుడు మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో మరో మైనర్ బాలికపై కీచకులు రెచ్చిపోయారు. తనపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న 17 ఏళ్ల బాలికను ఈవ్ టీజర్లు అర్ధనగ్నంగా చేసి.. ఆమె కుటుంబ సభ్యులపై సైతం దాడికి తెగబడ్డారు. గోరఖ్‌పూర్ జిల్లా చౌరీ చౌరా ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 

 

ఓ మైనర్ బాలికపై గౌతమ్, ముఖేష్ అనే ఇద్దరు వ్యక్తులు అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వేధించేవారు. ఆ బాలిక గతంలో వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు హెచ్చరించారు. అయినప్పటికీ వేధింపులు ఆగకపోవడంతో విసిగిపోయిన బాధితురాలు, కుటుంబ సభ్యులు పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుని, ఆదివారం సాయంత్రం తన వదిన, తండ్రితో కలిసి చౌరీచౌరా పోలీస్ స్టేషన్‌కు వెళ్తుండగా.. వారిపై నిందితులిద్దరూ దాడికి తెగబడ్డారు.

 

 

రోడ్డుపైనే బాలిక దుస్తులు చించివేసి, అడ్డువచ్చిన ఆమె తండ్రిని తీవ్రంగా కొట్టారు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో నిందితులిద్దరినీ సోమవారం అరెస్టు చేశారు. నిందితులపై పోస్కో చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసు నమోదు చేయడమే కాదు ఇలాంటి విషయాల్లో కఠినమైన శిక్షలు దయలేకుండా అమలు చేస్తేనే  ఇలాంటి వెధవలకు కాస్తైనా బుద్ధి వస్తుందంటున్నారు యావత్ ప్రజానీకం..

మరింత సమాచారం తెలుసుకోండి: