ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి. అనవసర విషయాలపై ప్రతిపక్షాలు అల్లర్లు చేస్తే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు విజయసాయి రెడ్డి. ఎప్పుడు ప్రతిపక్ష మాటలను తిప్పికొట్టే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్టర్ వేధికగా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

                           

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధిక ట్విట్ చేస్తూ ''దిశ చట్టాన్ని సాక్షాత్తు ప్రధాని ప్రశంసించారు. యాక్టు కాపీని పంపిస్తే తామూ అనుసరిస్తామని ఢిల్లీ, ఒరిస్సా, కేరళ రాష్ట్రాలు అభ్యర్థించాయి. చట్టం రూపొందించే చర్చలో పాల్గొనకుండా ఏడుపుగొట్టు తనాన్ని ప్రదర్శించారు చంద్రబాబు నాయుడు ఉల్లిపై లొల్లి చేసి దివాళాకోరుతనాన్ని బయట పెట్టుకున్నారు.'' అంటూ ట్విట్ చేశారు విజయసాయి రెడ్డి. 

                         

ఈ ట్విట్ కి స్పందించిన నెటిజన్లు.. కొందరు విజయసాయి రెడ్డికి మద్దతు ఇస్తే మరి కొందరు చంద్రబాబుకు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు జరిగే ఘటనలపై 21 రోజుల్లో చర్యలు తీసుకోండి సారూ అంటూ సంచలన కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ ట్విట్ వల్ల అటు టీడీపీ ఇటు వైసీపీ అభిమానులకు మధ్య చిన్నపాటి యుద్ధాలే జరుగుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: