కట్టుకున్న భర్త అంటే... భార్యని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి...ఎవ్వరి నుండి ప్రమాదం రాకుండా  రక్షణ కల్పించాలి . కానీ ఇక్కడో భర్త  మాత్రం ఎవరు ఆలోచించినంత  చెత్తగా ఆలోచించాడు.తన భార్యను  ప్రేమించమని తన కింది స్థాయి ఉద్యోగి ప్రోత్సహించాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన లో ఎవరు నమ్మలేని సంచలన నిజాలు బయటపడ్డాయి. గుజరాత్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఐదు నెలల క్రితం 19 ఏళ్ల నిఖిల్  సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అయితే పోలీసులు చేసిన విచారణలో అతని మృతికి యజమాని  కారణమని వెల్లడైంది. వస్సా సమీపంలోని వెడ్డింగ్ డెకరేషన్ కంపెనీలో గత సంవత్సర కాలం నుంచీ నిఖిల్ అనే యువకుడు ఉద్యోగంలో చేరాడు.. పది నెలలు పని చేసిన తర్వాత తను ఉద్యోగం మానేస్తున్నాను అని... తన తండ్రి అశోకు తెలిపాడు నిఖిల్ . ఎందుకని తండ్రి ప్రశ్నించగా యజమాని, యజమాని భార్య వేధిస్తున్నారంటూ ఆ  యువకుడు వాపోయాడు. 

 

 

 

జీతం తీసుకువస్తానని జూలై 14న ఆఫీస్ కి వెల్లి ... ఆపై తన యజమాని తో కలిసి రాజస్థాన్ కు వెళ్తున్నా అని తన తండ్రికి సమాచారం అందించాడు. ఇక అయిదు రోజులకి ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని వార్త  కుటుంబ సభ్యులకు చేరింది. ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న మూడు నెలల తర్వాత..ఓ రోజు  నిఖిల్ తోబుట్టువులు అతని సెల్ ఫోన్ పరిశీలిస్తుండగా నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. యజమానికి నిఖిల్ పంపిన మెసేజ్ లు చూసి కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. మీ బార్యను  ప్రేమించమని నాకు చెప్పారు మీరు చెప్పినట్లుగానే మీ భార్యను ప్రేమించాను ఇప్పుడు మీ భార్య కూడా  నన్ను ప్రేమిస్తుంది..  నాతో వివాహేతర సంబంధం కూడా పెట్టుకుంది. ఇప్పుడు మీరు మాట మార్చి మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ వదులుకోనని అంటున్నారు. బెదిరిస్తున్నారు జీతం కూడా ఇవ్వడం లేదు. నన్ను  బానిసలా చూడొద్దు... కాస్తయినా దయ చూపండి అంటూ నిఖిల్ తన యజమానికి పంపిన మెసేజ్ లు చూసి కుటుంబ సభ్యులు అందరూ షాక్కి గురయ్యారు . 

 

 

 ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు.. ఇక నిఖిల్ మొబైల్ లో నిన్న మెసేజ్ ల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు... యజమాని భార్య అతనీకంటే  ఇరవై ఏళ్ల చిన్నది అన్న విషయం పసిగట్టారు. అశోక్ ఫార్మర్ ప్రోత్సాహంతోనే ఆయన భార్యతో నిఖిల్ సంబంధం పెట్టుకున్నాడని విచారణలో తేలింది. అయితే ఇదే విషయాన్ని నిఖిల్ యజమాని భార్య తో చెప్పాడని దీంతో.. నిఖిల్ తనతో సంబంధం పెట్టుకోవడానికి కారణం భర్త అని తెలుసుకున్న భార్య  భర్తతో గొడవ పడింది. గొడవలతో విసిగి పోయిన యజమాని అశోక్ హెచ్చరించాడు. తన భార్యను వదిలేయమని  హెచ్చరించాడు. అయితే యజమాని భార్య మాత్రం నిఖిల్ ను వదిలెందుకు  ఇష్టపడలేదు. దీంతో ఇద్దరి మధ్య నలిగిపోయిన నిఖిల్ ఆత్మహత్యకు  పాల్పడ్డాడు. ఇక పోలీసులు ఆ భార్యభర్తలిద్దరు పై కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి తోశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: