ఛీ దీనమ్మ జీవితం మనిషి ఎంత కక్కుర్తిపరుడు అయ్యాడంటే ఒంట్లో కామం పుడితే పశువు అని కూడా చూడకుండా ఎగబడి కామవాంచ తీర్చుకుంటున్నాడు. పశువులకే విలువ ఇవ్వని మనిషి అని చెప్పుకునే రెండు కాళ్ల జంతువు ఇక పసిపిల్లలను, ముసలి వారిని ఏం వదిలి పెడుతుంది.

 

 

ఇప్పుడు సమాజంలో వ్యభిచారంతో పాటుగా అత్యాచారాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. చివరికి బిక్షాటన చేసుకునే వారిని కూడా వదలని స్దాయికి మృగాలు దిగజారుతున్నాయి. ఇదెంత దరిద్రమైన జీవితం అంటే చెప్పడానికి కుడా నీఛంగా అనిపిస్తుంది. ఓ ఇద్దరు కామాంధులు చేసిన పని... ఇక వివరాలు తెలుసుకుంటే మల్కాజ్‌గిరిలో ఇద్దరు కామాంధులు  60ఏళ్ల యాచకురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు.

 

 

లాలాపేటకు చెందిన చిన్నప్ప అంథోని జార్జ్‌(50), వికారాబాద్‌ జిల్లా స్టేషన్‌ ధరూర్‌కి చెందిన నేనావత్‌ విజయ్‌ కుమార్‌ వారి భార్యలకు దూరంగా ఉంటు, పెయింటింగ్‌ పనులు చేసు కుంటూ ఇద్దరు కలిసి మీర్జాలగూడలో  అద్దెకు ఉంటున్నారు.. ఇక 60ఏళ్ల యాచకురాలు రాత్రి 7 గంటల సమయంలో వీరి ఇంటి ముందుకు వచ్చి తినడానికి ఏమైనా ఇవ్వాలని కోరింది.

 

 

ఇదే అదునుగా భావించి అన్నం పెడతానని జార్జ్‌ ఆమెను లోపలకు పిలిచాడు. ఇద్దరూ వృద్ధురాలిని కబుర్లలోకి దించి తలుపులు మూసేశారు. బలవంతంగా మద్యం తాగించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వృద్ధురాలు కేకలు వేయడంతో స్థానికులు వెంటనే 100 నంబరుకు ఫోన్‌ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులను గమనించిన  నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

 

 

వీరిపై నిఘా పెట్టిన పోలీసులు శుక్రవారం మీర్జాలగూడలో తిరుగుతుండగా అరెస్ట్ చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇకపోతే ఇప్పటికే వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలతో మహిళలు ఆందోళన చెందుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: