ప్రజల నమ్మకాలను ఆసరాగా తీసుకుని దొంగ స్వామిజీలు, బాబాలు అక్రమాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలు మూడ నమ్మకాలను నమ్మినన్ని రోజులు దొంగ బాబాలు పుట్టుకు వస్తూనే ఉంటారు. అత్యంత దారుణమైన కొన్ని సంఘటనలు, కొందరు దొంగ బాబాలను చూస్తుంటే ఈ జనాలకు ఏమైంది, మరీ ఇంత తెలివి తక్కువగా ఎలా ప్రవర్తిస్తారు అనిపిస్తుంది. 

                     

ప్రజలు ఇంత పిచ్చివారా.. బాబా అంటేనే పూజలు చేసేస్తారా ? దేవత అంటేనే నమ్మేస్తారా ? అని అనిపిస్తుంది. తమిళనాడులో కాంచీపురంలో ఓ దేవత ప్రత్యేక్షమయ్యింది. అలాంటి ఇలాంటి దేవత కాదు.. ఏకంగా భద్రకాళియే దిగివచ్చిందా అనేంతలా ఉంది. ఆమె ద్రుష్టి పడితే ఎంతో మంచిది అని ఆమె చెయ్యి తగిలితే సకల రోగాలు నయమవుతాయని నమ్మించింది. 

                       

కబీలా సామియార్ అనే మహిళా ఈ భద్రకాళి అవతారం ఎత్తింది. ఓ ఆలయంలోకి అడుగుపెట్టిన ఈమె అక్కడికి వెంటనే నాగు పాములు ప్రత్యేక్షమయ్యాయి. దీంతో ఆ నాగుపాములకు క్షిరభిషేకం చేసి ఆమె అమ్మవారు అని ప్రచారం చేసింది. వెంటనే ఆ పాములను మేడలో వేసుకొని ఆమె అమ్మవారు అని బిల్డప్ ఇచ్చింది. 

 

ఇవి అన్ని చుసిన జనం ఆమెకు పిచ్చిగా పూజలు చెయ్యడం ప్రారంభించారు. పాలు, నెయ్యి, గంధం నీరుతో అభిషేకాలు చేయించుకుంటూ ఆమె ఉండిలు డబ్బుతో బాగా నింపుకుంటుంది. మన జనాలకు అలవాటే కదా.. అమ్మ ఆకలేస్తుంది అంటే అన్నం పెట్టేవారు లేరు కానీ నేను దేవత.. నేను బాబా అంటూనే మూఢనమ్మకంతో వారికీ లక్షలు లక్షలు దోచిపెట్టడం ప్రస్తుతం సర్వసాధారణం. మరి ఈ జనాలు ఎప్పుడు మారుతారో ఏమో.. 

మరింత సమాచారం తెలుసుకోండి: