తాళి అంటే పసుపుతాడు అనే భావనతో కొతమంది యువతులు బ్రతుకుతు ఉన్నారనిపిస్తుంది. ఎందుకంటే ఒకరితో వివాహం జరిగిన తర్వాత పడతి సర్వం పతియే. మరో మగాడికి మనసులో గాని పక్కలో గాని చోటు ఉండదు. కానీ నేటి కాలం పిల్లలో చూసుకుంటే పెళ్లి కాకముందే లవర్స్ ఉంటున్నారు. ఇలాంటి వారితో అర్దరాత్రి అపరాత్రి లేకుండా షికార్లు కొట్టడం నెల తప్పడం తర్వాత లబోదిబోమంటు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం. ఇది సర్వ సాధారణమై పోయింది.

 

 

ఎక్కడ చూడు దాదాపుగా జంటలే కనిపిస్తారే తప్ప ఒంటరిగా కనిపించరు. ఇక ఇది ఇలా ఉండగా కొందరికి పెళ్లితర్వాత కట్టుకున్న వాడు బోర్ కొడుతున్నాడు కావచ్చూ. అందుకే అక్రమ సంబందాలవైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదెంత ఘోరమంటే ఇలాంటి వారి బ్రతుకు చివరికి కుక్కలు చింపిన విస్తారాకువలే మారుతుంది. ఇకపోతే ఓ యువతి కట్టుకున్న మొగుడు ఉండగానే మరో యిద్దరు ప్రియుల్లతో రాసలీలు సాగించడం మొదలు పెట్టింది.

 

 

ఈవిడ విషయం తెలిసిన వారు దీని కామాన్ని తగిలెయ్యా ఇదెంత కామపిశాచిరా బాబు అని అనుకుంటున్నారు. ఇకపోతే ఈ కామాంధురాలి ముచ్చట తెలుసుకుంటే కావేరి అనే మహిళకు కృష్ణవంశీ అనే అతనితో కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. వీరిద్దరూ కరీంనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఇక గత కొంత కాలంగా ఇంట్లో ఒంటరిగా ఉంటున్న కావేరికి అదే ప్రాంతానికి చెందిన సమాన్విత్, గణేశ్ అనే యువకులతో పరిచయం ఏర్పడటం ఆపరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది.

 

 

ఈ క్రమంలో కృష్ణ వంశీ ఆఫీసుకు వెళ్లగానే ఆ యిద్దరు యువకులతో తాము ఉంటున్న ఇంట్లోనే రాసలీలలు కొనసాగిస్తు వస్తుంది. ఇలా భర్తకు తెలియకుండా రెండేళ్లుగా తన ఇద్దరు ప్రియుళ్లతో రాసలీలు సాగిస్తోంది. ఇక ఈ విషయం కాస్త కృష్ణవంశీకి తెలియడంతో అతడు తన భార్యను నిలదీశాడు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. అప్పటికీ ఆమె తన తీరు మార్చుకోక పోగా..  ప్రియుళ్లతో కలిసి దారుణ నిర్ణయం తీసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను హత్య చేయడానికి ప్లాన్ వేసింది. ఈ క్రమంలో వారి ప్లాన్ బెడిసికొట్టి అడ్దంగా పోలీసులకు దొరికిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: