మగవాడంటే తోలుబొమ్మ. ఆడదంటే ఆటబొమ్మ. లోకం తీరు ఇప్పుడు ఇదేనంటా. ఎందుకంటే నచ్చలేదని మొగున్ని. ప్రియున్ని చేతిలో సెల్ ఫోన్లను మార్చినట్లుగా మార్చేస్తున్నారు ఆడవారు. మగవారు ఏం తక్కువ తినలేదండో ఇది కాకపోతే మరొకరు కాని చాన్స్ దొరికినప్పుడే చాక్లెట్స్ లా చప్పిరించేద్దాం అని కుక్కలా ఎదురు చూస్తుంటారు.

 

 

ఇప్పుడున్న పరిస్దితుల్లో మగవాడికి ఎంతమంది ప్రియురాల్లో చెప్పడం ఎంత కష్టమో. ఆడవారికి ఉన్న లవర్స్‌ను కూడా అంచనా వేయడం అంతే కష్టం. ఇకపోతే ఒక్క ఆడదానికోసం రాజ్యాలే కూలిపోయాయని చరిత్ర చెబుతుంటే. రాజ్యాల సంగతేంటి ఆడదానికోసం కలికాలంలో ప్రాణాలు కూడా పోతున్నాయి. కుక్కల్లా కొట్టుకు చస్తున్నారు ఇది చాలదా నిదర్శనం అని కొందరు అనుకుంటున్నారు..

 

 

ఇకపోతే బిహార్ రాజధాని, పాట్నాలోని కొత్వాలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన యువతి మొదట ఓ యువకుడిని ప్రేమించింది. కొంతకాలంగా తర్వాత అతడి ప్రవర్తన నచ్చకపోవడంతో దూరం పెట్టింది. ఇటీవల మరో యువకుడిని ప్రేమించి అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. ఈ క్రమంలో ఆ యువతి తన తాజా ప్రియుడితో కలిసి బుద్ధ స్మృతి పార్కుకు వెళ్లింది. వీళ్లిద్దరు మాంచి మూడులో ఉండగా ఈ సన్నివేశాన్ని ఆమె పాత ప్రియుడు చూశాడు.

 

 

దీంతో ఆవేశం పట్టలేక వారి వద్దకు వచ్చి కుమారితో గొడవ పడ్డాడు. పక్కనున్న ఆమె ప్రియుడు అడ్డుకోవడంతో వివాదం పెద్దదైంది. దీంతో ఆ యువకులిద్దరూ పార్కులోనే విచక్షణా రహితంగా కొట్టుకుంటూ ఆమెను వదిలేయాలంటూ ఒకరికి ఒకరు వార్నింగ్ ఇచ్చుకున్నారు..

 

 

ఈ ఘటనను స్దానిక పార్కు వచ్చిన వారు చూసి పోలీసులకు సమాచారం అందించగా వారు వెంటనే అక్కడికి చేరుకుని యువకులతో పాటు ఆ యువతిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వారి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి వారి పిల్లల ప్రవర్తన గురించి క్లాస్ పీకారు. చివరికి ఆ ముగ్గురి పేరెంట్స్ రాజీకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేయకుండా వదిలేశారు. ఇప్పుడు ఈ ఘటన మాత్రం పాట్నాలో చర్చనీయాంశంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: