ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి. అనవసర విషయాలపై ప్రతిపక్షాలు అల్లర్లు చేస్తే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు విజయసాయి రెడ్డి. ఎప్పుడు ప్రతిపక్ష మాటలను తిప్పికొట్టే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్టర్ వేధికగా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

                       

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా ట్విట్ చేస్తూ ''తుళ్లూరు రైతులు చంద్రబాబును ఇంకోసారి నమ్మితే అంతకంటే అమాయకత్వం ఉండదు. తన బంధువర్గాల రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం ఒకసారి వారిని ఫణంగా పెట్టాడు. మళ్లీ వారినే అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడిస్తున్నాడు. ఎవరికీ అన్యాయం జరగదు. బాబును దూరం పెడితే అన్నీ పరిష్కారం అవుతాయి.'' అంటూ ట్విట్ పెట్టారు విజయసాయి రెడ్డి. 

                    

ఈ ట్విట్ పై స్పందించిన నెటిజన్లు కొందరు ఈ ట్విట్ ని సమర్దిస్తే.. మరికొందరు ఈ ట్విట్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంకా ఈ ట్విట్ కారణంగా వైసీపీ అభిమానుల మధ్య టీడీపీ అభిమానుల మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. కాగా ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: