22ఏళ్ల యువతి పెళ్ళైన ఒక వ్యక్తిని ప్రేమించింది. తననే పెళ్ళిచేసుకుందామనుకుంది. పిచ్చిగా నమ్మి ఆమె తన సర్వస్వాన్ని తన లవర్ కి అర్పించింది. కానీ, చివరికి తనది మాత్రమే నిజమైన ప్రేమని, తన లవర్ ది అసలు లవ్వే కాదని తెలుసుకుంది. అతను కేవలం ఆమెను ఒక సెక్స్ వస్తువుల చూశాడని తెలిసి తట్టుకోలేకపోయింది.

వివరాల్లోకి వెళితే, మణికొండ సమీపంలోని చిత్రపురి కాలనీకి చెందిన ఓ యువతి (22) మాదాపూర్‌లోని ఒక సంస్థలో సీనియర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న పెళ్ళైన వ్యక్తితో పరిచయం పెంచుకుంది. కొన్ని రోజుల తర్వాత అతనిపై మనసు పారేసుకుంది. అది తెలుసుకున్న అతను ఆమెను శారీరికంగా వాడుకుందామని అనుకున్నాడు. పెళ్ళైనప్పటికీ ఈమెతో నాటకపు ప్రేమాయణం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆమెను ఒక సెక్స్ టాయ్ గా వాడుకొని తన లైంగికవాంఛను తీర్చుకున్నాడు సదరు లవర్.

అయితే, మోజు తీరిపోయిందో ఏమో కానీ కొన్ని వారాల నుంచి అతడు ఆమె నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. యువతికి ఏం జరిగిందో తెలియక మానసికంగా కృంగిపోయింది. బుధవారం రోజు ఈ యువతి బాచుపల్లి రాజీవ్‌గాంధీనగర్‌లో ఉన్న తన లవర్ ఇంటికి వెళ్లి అతని ఆచూకీ గురించి అడిగింది. కానీ అతని తల్లిదండ్రులు తమ కొడుకు అక్కడ లేడని చెప్పారు. దాంతో ఆమె కోపం కట్టలుతెంచుకుంది.. మీ కొడుకుని నాకిచ్చి పెళ్లి చేస్తారా లేదా అంటూ తన బాయ్ ఫ్రెండ్ తల్లిదండ్రులను కడిగిపడేసింది.


యువతి కోపానికి భయబ్రాంతులకు గురైన ఆ వ్యక్తి తల్లిదండ్రులు బాచుపల్లి పోలీసులకు ఈ విషయం తెలియజేసారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి తో సహా వ్యక్తి తల్లిదండ్రులను కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత ఆమె పూర్తిగా అసహనం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ లో ని గోడల కి తల గట్టిగా కొట్టుకుంటూ.. వస్తువులను కింద పడేస్తూ.. స్టేషన్ నుంచి బయటకు ఉరుకుతూ లోపలికి వస్తూ నానా హంగామా సృష్టించింది. దీంతో ఆమెను ఎలా శాంతి పరచాలో తెలియని పోలీసులు తలలు పట్టుకున్నారు. 'అమ్మా, తల్లి..!! మీ బాయ్ ఫ్రెండ్ తోనే నీ పెళ్లి చేస్తాము, అమ్మా', అని పోలీసులు నచ్చజెప్పి ఆమె కోపాన్ని ఎట్టకేలకు శాంతి పరిచారు. తర్వాత యువతిపై చిన్న కేసు పెట్టి తన కుటుంబ సభ్యులకు అప్పగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: