కేశినేని నాని.. అప్పుడు ఎప్పుడో సొంత పార్టీపై చిరాకు వచ్చి సొంత పార్టీ ఎమ్మెల్సీని ట్విట్టర్ వేదికగా నాలుగు అక్షరాలు కూడా రావు ఎగిసి ఎగిసి పడుతావ్ అని ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు చేసుకున్న సంగతి తెలిసిందే. 

 

ఆ మాటలు విన్న ప్రజలు అందరూ కూడా.. కేశినేని నాని త్వరలోనే వైసీపీ తీర్ధం పుచ్చుకుంటారు.. అని అందరూ భావించారు. కానీ ఎవరు ఊహించని విధంగా అతను టీడీపీలోనే ఉండిపోయారు.. అసలు ఇప్పుడు టీడీపీని ఒక మాట అనటం లేదు.. వైసీపీని ఏ ప్రశ్నిస్తున్నారు. అయన ఎంత ప్రశ్నించిన.. ఎంత వైసీపీపై మండిపడిన పెద్ద ఉపయోగం ఉండదు. 

 

ఎందుకంటే ప్రజలు బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయారు.. కేశినేని నాని వైసీపీలోకి త్వరలోనే వస్తారు అని. అయితే ప్రస్తుతం టీడీపీలోనే ఉండటంతో కేశినేని నాని జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆ వ్యాఖ్యలు కూడా ఇండైరెక్ట్ గా చంద్రబాబుని అన్నట్టే ఉన్నాయని అంటున్నారు నెటిజన్లు. 

 

కేశినేని ట్విట్టర్ వేధికగా ట్విట్ చేస్తూ ''జగన్ అన్నా ప్రజాగ్రహం ముందు నీలాంటి నియంతలు చాలా మంది కాలగర్భంలో కలిసి పోయారు. ప్రజా ఉద్యమాలను పోలీసులే కాదు ఎవరూ అణచలేరు అమరావతి నుంచి రాజదాని మార్చి నీ గోయి నువ్వు తవ్వుకోవద్దు.'' అంటూ ట్విట్ చేశారు. 

 

అయితే ఈ ట్విట్ కి స్పందించిన నెటిజన్లు ''డియర్ సర్, అవును మీరన్నది నిజమే. కానీ మీ మాటలు ముందుగా మీ నాయకుడికి తగులుతాయి. ఆయన 2014లో గెలిచిన తీరు, ఆ తర్వాత పాలించిన విధానం, ఫలితంగా ఘోర పరాజయం. ఇవన్నీ మీ మాటకు నిదర్శనాలే. కాదంటారా...ఆలోచించండి..'' అంటూ కామెంట్ పెట్టి నెటిజన్లు కడిగేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: