మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఆడపిల్ల కనిపిస్తే చాలు కామంతో ఊగిపోయే మృగాళ్లు  ఎక్కువగా కనిపిస్తున్నారు. దీంతో రోజురోజుకీ మహిళలకు ఎక్కడికెళ్లినా రక్షణ కరువవుతోంది. ఆడపిల్లగా పుట్టడమే మేము చేసిన పాపమా అనే బాధ పడే పరిస్థితులు ఏర్పడ్డాయి నేటి సమాజంలో. మాయమాటలు చెప్పి ఆడపిల్లలను లొంగదీసుకునే వాళ్ళు కొందరయితే.. కామంతో కళ్లు మూసుకుపోయి బలవంతంగా మీద పడి అత్యాచారాలు చేసేవారు ఇంకొందరు... వావి వరసలు మరిచి రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళ మీదే కామంతో కళ్లు మూసుకుపోయి అఘాయిత్యానికి పాల్పడిన వారు మరికొందరు..ఇలా  ప్రతి చోట ప్రతి ఒక్కరితో ఆడ పిల్లలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు. 

 

 

 అసలు నేటి సమాజం తీరు ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రోజురోజుకు మహిళలపై అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి తప్ప తగ్గిన  దాఖలాలు మాత్రం లేవు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా  ఘటనలో నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన తర్వాత కూడా ఒక్కరిలో  కూడా భయం పుట్టిన దాఖలాలు లేవు. తాజాగా ఇలాంటి అత్యాచారమే మరొకటి జరిగింది. ఇద్దరు యువకులు 19 ఏళ్ల యువతిని ఐదు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారు. చివరికి ఆ యువతి గర్భం దాల్చడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్ లో దారుణ ఘటన జరిగింది. పట్టణానికి చెందిన 19 ఏళ్ల యువతిని బెదిరించి ఇద్దరు యువకులు గత ఐదు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. 

 

 

 

కూలి పనులు చేసే యువతి తల్లిదండ్రులు రోజు పనులకు వెళ్ళేవారు. దీంతో యువతి ఒంటరిగా ఇంట్లో ఉండేది. ఇది గమనించిన ఇంటి సమీపంలో ఉండే పెదనాన్న కుమారుడు నవీన్... నవీన్ స్నేహితుడు రవి తో కలిసి ఆమె ఇంటికి వెళ్లి ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఐదు నెలలుగా ఈ దారుణం జరుగుతూనే ఉంది. ఆ యువతి విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే చంపేస్తామని బెదిరించారు. అయితే తాజాగా ఆ యువతి గర్భం దాల్చింది. దీంతో షాక్కి గురైన తల్లిదండ్రులు ఆరాతీయగా అసలు విషయం బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న నిందితులు పరారయ్యారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: