నిజామాబాద్ కు చెందిన ఒక 19 ఏళ్ల అమ్మాయిని ఆమె పెదనాన్న కొడుకు, ఇంకా అతని స్నేహితుడు కలిసి గత రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నారు. అయితే, బాధితురాలైన ఆమె ప్రస్తుతం ఐదవ నెల గర్భం దాల్చింది. ఇద్దరు నిందితులు బాలిక తల్లిదండ్రులు పనికి వెళ్ళిన సమయంలో ఆమెపై అత్యాచారం చేసారని నిజామాబాద్ పోలీసులు చెబుతున్నారు.


వివరాల్లోకి పోతే, బీటీనగర్‌ లో నివసిస్తున్న 19ఏళ్ల దివ్యాంగురాలు తన పదవ తరగతి పూర్తి చేసి ఇంట్లోనే ఉంటుంది. తన అమ్మానాన్న కూలి పనులకు వెళుతుండగా ఈమె ఒంటరిగా ఇంట్లోనే ఉండేది. బాలిక తల్లిదండ్రులు పనికి వెళ్ళిపోగానే, పెదనాన్న కొడుకైనా నవీన్‌(25), అతడి ఫ్రెండ్ రవి(22) ఆమె ఇంటికి వచ్చేవారు. వాళ్లిద్దరూ ఆమె ఒంటరితనాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆమెపై లైంగిక వేధింపులకు ఒడికట్టేవారు. ఒకరోజు ఆమెపై అత్యాచారం చేసారు. ఆరోజు నుంచి అలానే 2 సంవత్సరాల పాటు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఎవరికైన చెబితే చంపేస్తామని ఆమెను బెదిరించడంతో.. ఆమె ఈ విషయాన్ని బయటపెట్టలేదు.



కొన్ని నెలల తరువాత ఆమె గర్భవతి అయింది. తల్లిదండ్రులు ఆమె శరీరంలో మార్పులు గమనించి ఆరా తీయగా ఆ బాలిక.. నవీన్, రవి చేసిన లైంగిక దాడి గురించి చెప్పింది. వరుసకు అన్న అయిన నవీన్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలియగానే వారు షాక్ అయ్యారు. ఆపై వారు పోలీసుల వద్దకు వెళ్లకుండా వారి కుల పెద్దలను ఆశ్రయించారు. బాలిక మాత్రం ఓ ఎన్జీఓను సంప్రదించి.. ఆ ఎన్జీవో కు అధ్యక్షురాలైన సుజాత సూర్యవంశీ సహాయంతో... బోధన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులు కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: