రోజురోజుకు మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ఆకతాయిల నుండి మాత్రమే మహిళకు లైంగిక వేధింపులు ఎదురయ్యేది.. కానీ ఇప్పుడు మాత్రం సొంత వారి నుంచి గురువుల నుంచి కూడా లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి. విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువులు  కామంతో కళ్లు మూసుకుపోయి మీద పడి పోతున్నారు. పరీక్షల పేరుతో బ్లాక్ మెయిల్ చేసి విద్యార్థులను లొంగదీసుకొని అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఈ రోజుల్లో కోకొల్లలుగా తెరమీదికి వస్తున్నాయి. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చట్టాలు తీసుకొచ్చినప్పటికి కూడా ఎవ్వరు లో మార్పు మాత్రం కనిపించడం లేదు. గురువు అనే ముసుగులో విద్యార్థులపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు . తాజాగా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది.

 

 

 వివరాల్లోకి వెళితే... ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి పట్టణానికి చెందిన ఎన్నారై మెడికల్ కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మెడికల్ కళాశాలలో పీజీ చదువుతున్న వైద్య విద్యార్థినిలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న రేడియాలజీ హెచ్ఓడి డాక్టర్ తుమ్మల నాగేశ్వరరావు పై కేసు నమోదైంది. విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులను సక్రమంగా తీర్చి దిద్దాల్సిన ఒక ప్రొఫెసర్ కామంతో కళ్లు మూసుకుపోయి విద్యార్థులనే కామ వాంఛ తీర్చాలి అంటూ  వేధింపులకు గురిచేశాడు. తన కోరిక తీర్చకపోతే ఎలా పాసవుతారు చూస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. తనను శారీరకంగా సుఖపెట్టాలి అని దీని కోసం ఒంటరిగా తన ఇంటికి రావాలి అంటూ విద్యార్థులను బెదిరించేవాడు. అంతేకాకుండా అసభ్యకరమైన మాటలు చేష్టలతో తీవ్ర వేధింపులకు పాల్పడేవాడు ఈ కీచక టీచర్. 

 

 

అంతేకాకుండా ఫోన్ లో  అసభ్యకరమైన మెసేజ్ లు పంపుతూ ఉండేవాడు. ఇక ఈ కీచక ప్రొఫెసర్ వేధింపులు రోజురోజుకి ఎక్కువవడంతో భరించలేని విద్యార్థినులు కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా ఈ విషయం ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ దృష్టికి వెల్లింది... ఈ ఘటనపై సీరియస్గా స్పందించింది ఆమె. ఈ మేరకు రేడియాలజీ హెచ్ఓడి తుమ్మల నాగేశ్వరరావు పై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా నేరం రుజువు కావడంతో 14 రోజుల రిమాండ్ విధించి గుంటూరు జిల్లా కర్మాగారానికి పంపారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: