రాజకీయాల్లో విమర్శలు ఇప్పటికే శృతి మించిన స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ప్రజా జీవితం పేరుతో వ్యక్తిగత జీవితాన్ని సైతం ప్రస్తావిస్తూ... గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొనసాగుతున్నాయి. తాజాగా ఇలా కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన విమర్శలు ఇప్పుడు ఆ పార్టీకే బూమరాంగ్ అయ్యాయి.
భోపాల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సేవాదళ్ జాతీయ శిక్షణా శిబిరం జరుగుతోంది. దీనికి హాజరైన వలంటీర్లకు ఓ పుస్తకాన్ని
పంచిపెట్టింది. కాంగ్రెస్ సేవాదళ్ ప్రచురించిన ఓ పుస్తకంలో హిందూ మహాసభ సహ వ్యవస్థాపకుడు వీర్ సావర్కర్పై సంచలన వ్యాఖ్యలు చేసింది. మహాత్మాగాంధీ హంతకుడు నాథూరాం గాడ్సేకు, సావర్కర్కు మధ్య స్వలింగ సంపర్కం ఉండేదని తెలిపింది. ‘వీర్ సావర్కర్ కిత్నే వీర్? (వీర్ సావర్కర్ వీరత్వం ఎంత?) అన్న శీర్షికన ముద్రించిన ఈ పుస్తకంలో ఉన్న అంశాలు సహజంగానే వివాదంగా మారాయి. డొమినిక్ లాపియెర్రె, లారీ కోలిన్స్ రాసిన ‘ఫ్రీడం ఎట్ మిడ్నైట్' పుస్తకం నుంచి ఒక ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, ‘బ్రహ్మచర్యాన్ని స్వీకరించడానికి ముందు నాథూరాం గాడ్సే ఒకే ఒకసారి లైంగిక సంపర్కంలో పాల్గొన్నా డు. ఆయన తన రాజకీయ గురువైన వీర్ సావర్కర్తో స్వలింగ సంపర్క సంబంధం పెట్టుకున్నాడు’ అని సేవాదళ్ పుస్తకం పేర్కొంది. నాథూరాం గాడ్సేతో సావర్కర్కు స్వలింగ సంపర్క సంబంధం ఉండేదని, మైనారిటీలకు చెందిన మహిళలపై లైంగికదాడులు చేయాలని ఆయన హిందువులను రెచ్చగొట్టేవాడని కాంగ్రెస్ సేవాదళ్ ఈ పుస్తకంలో ఆరోపించింది.
కాంగ్రెస్ సేవాదళ్ పుస్తకం, అందులో చేసిన వివాదాస్పద విమర్శలపై అఖిల భారతీయ హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామీ చక్రపాణి ఊహించని రీతిలో స్పందించారు. కాంగ్రెస్ మాజీ రాహుల్ గాంధీ స్వలింగ సంపర్కుడు అని ఆరోపించారు. రాహుల్ గాంధీ కూడా హోమోసెక్సువల్ అని విన్నట్లు స్వామీజీ అన్నారు. గాడ్సే, సావర్కర్ స్వలింగ సంపర్కులు అని కాంగ్రెస్ ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.