ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి. అనవసర విషయాలపై ప్రతిపక్షాలు అల్లర్లు చేస్తే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు విజయసాయి రెడ్డి. ఎప్పుడు ప్రతిపక్ష మాటలను తిప్పికొట్టే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్టర్ వేధికగా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.                     

                

విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ.. ''ఇన్ సైడర్ ట్రేడింగులో భూములు చౌకగా కొట్టేసిన ఎలుకలన్నీ కలుగుల్లో నుంచి బయటి కొస్తున్నాయి. పరువు నష్టం దావా వేస్తామని, దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండని సవాళ్లు విసురుతున్నారు. సిఐడి లేదా సిబిఐతో దర్యాప్తు జరిపించమని లేఖలు రాయండి మీరు నిప్పులో తుప్పులో తేలుతుంది.'' అంటూ ట్విట్ చేశారు. 

                                       

ఈ ట్విట్ చుసిన నెటిజన్లు.. అటు విజయసాయి రెడ్డిపై.. ఇటు చంద్రబాబుపై మండిపడుతున్నారు. మరి కొంతమంది టీడీపీ అభిమానులు.. వైసీపీ అభిమానులు అయితే ట్విట్టర్ వేదికగా చిన్నపాటి యుద్ధమే చేసుకుంటున్నారు. దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: