వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ప్రతిపక్షాలను ఎప్పటికప్పుడు ఏకిపారేస్తుంటారు. అనవసర విషయాలపై ప్రతిపక్షాలు అల్లర్లు చేస్తే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండే విజయసాయి రెడ్డి ఈరోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో సీఎం జగన్ పై ఎన్నో దుష్ప్రచారలు చేశారని.. కానీ చివరికి వాళ్ళ పార్టీనే చిన్నాభిన్నం అయ్యింది అని అయన వ్యాఖ్యానించారు.                

 

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా ట్విట్ చేస్తూ... ''ఎలక్షన్ల ముందు కూడా ఇలాగే దుష్ప్రచారం చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు సిఎం అయితే భూములు లాక్కుంటారని, ఇళ్లలోంచి వెళ్లగొడతారని, రౌడీరాజ్యం వస్తుందని భయానక దృశ్యాలు చూపించారు. ప్రజలు మిమ్మల్నే అధికారం నుంచి విసిరి కొట్టి బుద్ధి చెప్పారు. అయినా అవే గోబెల్స్ ప్రచారాలు చేస్తున్నారు.'' అంటూ ట్విట్ చేశారు విజయసాయి రెడ్డి. 

 

కాగా విజయసాయి రెడ్డి ట్విట్ చుసిన కొందరు నెటిజన్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతూ.. దిక్కు తోచని స్తితిలో పడిపోయిన చంద్రబాబు. గంటల కొద్ది ప్రెస్మీట్ పెట్టి జర్నలిస్టుల బుర్ర తింటున్నాడు చంద్రబాబు అంటూ కామెంట్లు పెట్టారు. ఈ ట్విట్ వల్ల వైసీపీ టీడీపీ పార్టీ అభిమానుల మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: