వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ప్రతిపక్షాలను ఎప్పటికప్పుడు ఏకిపారేస్తుంటారు. అనవసర విషయాలపై ప్రతిపక్షాలు అల్లర్లు చేస్తే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండే విజయసాయి రెడ్డి ఈరోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించిన ప్రభుత్వాన్ని ఇన్ సైడర్లు ఛాలెంజ్ చేస్తున్నారు అంటూ అయన సంచలన ట్విట్ చేశారు. 

                            

విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ ''రాష్ట్ర ప్రజానీకం అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రభుత్వాన్ని‘ఇన్ సైడర్లు’ ఛాలెంజ్ చేస్తున్నారు. కమీషన్ల కోసం మేం మొదలు పెట్టినవన్నీ కొనసాగించాలంటున్నారు. గోబెల్స్ ప్రచారాలకు తెగబడుతున్నారు. పయ్యావుల గారు తన బాస్ చంద్రబాబు తండ్రి, తాతల ఆస్తుల గురించి మాట్లాడితే బాగుంటుంది.'' అంటూ ట్విట్ చేశారు.                  

                                   

ఈ ట్విట్ చుసిన నెటిజన్లు.. విజయసాయి రెడ్డికి కొందరు సపోర్ట్ ఇస్తే మరికొందరు మండిపడుతున్నారు. మరి కొంతమంది టీడీపీ అభిమానులు.. వైసీపీ అభిమానుల మధ్య అయితే ట్విట్టర్ వేదికగా చిన్నపాటి యుద్ధమే జరిగింది. దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: