సంక్రాంతికి విడుద‌ల‌వుతున్న రెండు భారీ చిత్రాలు మొద‌టి నుంచి కూడా అన్ని విష‌యాల్లో పోటీప‌డుతూనే వ‌చ్చాయి. ఇటు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న `అల‌వైకుంఠ‌పురంలో` అటు అనిల్‌రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో `స‌రిలేరు నీకెవ్వ‌రు` ఈ రెండు చిత్రాలు పోటీ ప‌డుతున్నాయి. అయితే ఇందులో కాస్ట్ అండ్ క్రూ కూడా బాగా బ‌ల‌మైన వాళ్ళ‌నే తీసుకున్నారు ఈ ఇద్ద‌రు ద‌ర్శ‌కులు. దాదాపు ప‌ద‌మూడేళ్ళ గ్యాప్ త‌ర్వాత విజ‌య‌శాంతి స‌రిలేరునీకెవ్వ‌రు చిత్రం నుంచి రీ ఎంట్రీ ఇవ్వ‌బోతుంటే. ట‌బు అల‌వైకుంఠ‌పురం చిత్రం నుంచి రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. ఇక మ‌రి ఈ పోటీలో వారిద్ద‌రు ఎవ‌రు నెగ్గుతారు అన్న‌ది వేచి చూడాలి. 

 

స‌రిలేరు నీకెవ్వరులో చాలా విజ‌య‌శాంతి చాలా కీలక పాత్ర పోషిస్తోండగా, టబుది అల‌వైకుంఠ‌పురంలో కేవలం అలంకార ప్రాయమైన పాత్ర మాత్రమేనని తెలిసింది. అల్లు అర్జున్‌ తల్లిగా ఆమె పాత్ర పరిధి తక్కువేనని, ఈ చిత్రం కోసం ఆమె వర్క్‌ చేసిన రోజులు కూడా చాలా తక్కువేనని సమాచారం. 

 

స‌రిలేరులో విజ‌య‌శాంతిది అత్తారింటికిలో న‌దియా రోల్ టైప్ అని టాక్‌. టబుకి వున్న పాపులారిటీ దృష్ట్యా ఆమెకి కూడా పెద్ద పాత్రనే త్రివిక్రమ్‌ ఆఫర్‌ చేసాడని అనుకోవచ్చు కానీ ఆమె జయరామ్‌ భార్యగా ఏదో ఫ్యామిలీ సీన్స్‌లో కనిపించడం మినహా అంత సీనేమీ వుండదట. ట‌బు లుక్ కూడా చూసేందుకు ఎట్రాక్టివ్‌గా లేదు. విజ‌య‌శాంతి నిండుగా ఉంది. అలాగే ఈ రెండు ట్రైల‌ర్ల‌లో వీళ్ళ సీన్స్ చూస్తుంటే.. విజ‌య‌శాంతి మంచిపెర్షార్మెన్స్ మ‌రియు మంచి పొగ‌రు ఉన్న పాత్ర‌లో ఇర‌గదీసింద‌న్న‌ట్లు ఉంది. ఇక ట‌బు విస‌యానికి వ‌స్తే ఆ పాత్ర‌ని బ‌ట్టి పెద్ద‌గా ఆమెకు యాక్టింగ్ స్కోప్ ఉన్న‌ట్లు క‌నిపించ‌లేదు. ఏది ఏమైన‌ప్ప‌టికీ లేడీ అమితాబ్ అంటే లేడీ అమితాబే అని  కొంద‌రు భావిస్తున్నారు. చివ‌రికి ఎవ‌రు నెగ్గుతారో తెలియాలంటే సినిమా విడుద‌ల‌య్యేవ‌ర‌కు వేచి చూడాల్సిందే మ‌రి. అలాగే విజ‌యంశాంతి అందం ఏమాత్రం త‌గ్గ‌లేదు. ఇటీవ‌లె చిరంజీవి చెప్పిన‌ట్టు అదే అందం అదే పొగ‌రు అదే హుందాత‌నం అన్న‌ట్లు ఉన్నాయి ఆమె స్టిల్స్‌. కానీ ట‌బు ఫేస్‌లో ఆ గ్లో మిస్ అయింద‌నే అనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: