వైసీపీ ప్రధాన కార్యదర్శి, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ట్విట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జయము జయము చంద్రన్న భజనతో మొదలై జోలె పట్టుకునే వరకు వెళ్లింది ఉద్యమం అంటూ సెటైర్లు వేశారు. అమరావతిలో చంద్రబాబు, టీడీపీ నేతలు చేస్తున్న ఆందోళనలపై సెటైర్లు వేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు విజయసాయి రెడ్డి.                           

 

విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ.. ''జయము జయము చంద్రన్న భజనతో మొదలై జోలె పట్టుకునే వరకు వెళ్లింది ఉద్యమం. 40 ఇయర్స్ ఇండస్ట్రీ 4 వేల ఎకరాల ‘ఇన్ సైడర్’ భూముల కోసం పడరాని పాట్లు పడుతోంది. ఎక్కడ ఒక ప్రాణం పోతుందా అని రాబందులాగా కాచుక్కూర్చుంది.'' అంటూ ట్విట్ చేశారు.         

 

ఈ ట్విట్ చుసిన నెటిజన్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకదా సర్.. చంద్రబాబు తన భూమి కాపాడుకోవటం కోసం ఎంత అయినా తెగిస్తాడు.. ఇంకా ఎంతమందిని రెచ్చగొడుతాడో ఈ చంద్రబాబు అంటూ నెటిజన్లు సంచలన కామెంట్లు చేస్తున్నారు. ఈ ట్విట్ కారణంగా వైసీపీ అభిమానుల మధ్య.. టీడీపీ అభిమానుల మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. దీంతో ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: