మద్యంమత్తులో ఉంటె ఎం చేస్తున్నాం అనేది కుడి స్పృహ ఉండదా? మనుషులకు. మరి ఇంత దారుణమా.. కంటికి రెప్పలా కూతురిని కాపాడుకోవాల్సిన తండ్రే ఘోరాతి ఘోరంగా 5 ఏళ్ళ కూతురుని చంపి జైలు పాలయ్యాడు. ఈ దారుణమైన ఘటన తెలంగాణలోని హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ లో చోటు చేసుకుంది.            

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బాలాజీ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ కసాయి తండ్రి కన్నకూతుర్ని చంపేశాడు. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది. 5 ఏళ్ళ కూతురుయామినీని అత్యంత దారుణంగా హతమార్చిన దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.                   

 

బాలాజీరావు నగర్ ‌లో ఉంటున్న దుర్గారావు వాచ్ మెన్‌గా పని చేస్తున్నాడు. అతడికి భార్యా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. తాగుడుకు బానిసైన దుర్గారావు నిత్యం భార్య పిల్లల్ని వేధించి హింసించేవాడు. నిత్యం భార్యను పిల్లల్ని కొట్టేవాడు. కాగా తండ్రి తాగుడుకు బానిస అవ్వడం వల్ల పిల్లల జీవనం కోసం భార్య చుట్టు పక్కల ఇళ్లలో పనులు చేస్తుంది. 

 

ఈ నేపథ్యంలోనే తల్లి పనికి వెళ్లిన సమయంలో తాగి వచ్చిన దుర్గారావు పెద్ద కూతురిని చితకబాది గొంతు నులిమి హత్య చేశాడు. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దుర్గారావును అరెస్ట్ చేశారు. కాగా తెలంగాణాలో ఇలాంటి ఘటనలు రోజు రోజుకు ఎక్కువ అయిపోతున్నాయి. మద్యానికి బానిసై ఇలాంటి కుటుంబాలు ఎన్నో చిన్నాభిన్నం అవుతున్నాయి. మాధ్యమత్తులోనే స్పృహ లేకుండా హతమారుస్తున్నారు ఈ దారుణమైన మందుబాబులు. ఎప్పుడు మద్యాన్ని మానేస్తారు.. కుటుంబంపై బాధ్యత ఎప్పుడు పెరుగుతుందో దేవుడికే తెలియాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: