10 ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మాట్లాడడం పవన్ కల్యాణ్ కి అలవాటు అని మండిపడుతూ ఉంటుంది వైకాపా పార్టీ .. అయితే మోతాదు కి మించి మాట్లాడడం ఎవ్వరికీ మంచిది కాదు అని వైకాపా వారు కూడా అర్ధం చేసుకోవాలి . రీసెంట్ గా వైకాపా ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖర్ మాటలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాన్‌ను కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బూతులు తిట్టారు. నోటికి వచ్చిన బూతులతో చంద్రశేఖర్ రెడ్డి రెచ్చిపోయిన వీడియొ లు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.

 

 

కాకినాడ ఎంపీ వంగా గీతతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ వేదిక మీదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బూతులు తిట్టారు. ఆయన బూతులు తిడుతుంటే ప్రజలు చప్పట్లు కొట్టారు. ఇది షాకింగ్ పరిణామం అనే చెప్పాలి . రాజకీయాలు అత్యంత నీచ స్థాయి కి దిగజారిపోవడం చూస్తుంటే ప్రజలు అస్సలు పట్టించుకొనట్టు గా చప్పట్లు కొట్టడం చూస్తే ఎవ్వరికైనా బాధ వేస్తుంది. ఇలాంటి చర్యలు తీవ్రంగా ఖండించాల్సి ఉంది .

 

 

జగన్ కూడా ఈ విషయం పైన సీరియస్ అయ్యారు అనీ రోడ్ మీద రోడ్ షో ర్యాలీ లో భాగంగా బూతులు వాడాల్సిన అవసరం ఏముంది అంటూ వాపోతున్నారు రాజకీయ విశ్లేషకులు . జగన్ వరకూ ఈ విషయం వెళ్లింది అనీ ఇంకొక్కసారి రిపీట్ అయితే ఊరుకునేది లేదు అంటూ కొప్పడ్డారు అంటూ ఇంటర్నెట్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. రాజకీయాలు అన్నాక విమర్శలు , ప్రతి విమర్శలు , రాజకీయ ఎదురు దాడి , ఘాటు వ్యాఖ్యలు మామూలే కానీ ఇలా ఏకంగా బూతులు తిట్టుకోవడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు  చాలామంది . 

 

మరింత సమాచారం తెలుసుకోండి: