ఎప్పుడు ట్విట్టర్ లో ప్రతిపక్ష నేతలను ఏకిపారేసే విజయసాయి రెడ్డి ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమరావతి రాజధాని విషయంలో తండ్రి, కొడుకులు అవలంభిస్తున్న తీరుపై వ్యంగ్యాస్థ్రాలు సంధించారు. చంద్రబాబు స్వభావం మొదటినుండి అలాగే ఉంది అంటూ మండిపడ్డారు.  

 

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ''చంద్రబాబు నాయుడు స్వభావం మొదటి నుంచి అంతే. ప్రజా ధనాన్ని తన సొత్తు అన్నట్టుగా అడ్డగోలుగా లూటీ చేస్తాడు. అడ్డం తన్నగానే తన బాధ ప్రజల బాధగా చిత్రీకరిస్తాడు. ఎల్లో మీడియా మోత మోగించే రోజుల్లో అయితే ఆడింది ఆటగా సాగేది? సోషల్ మీడియా సూర్యుడు పొడిచాక చీకటి చుక్కలు అదృశ్యమయ్యాయి.'' అంటూ సంచలన ట్విట్ చేశారు విజయసాయి రెడ్డి.       

 

ఈ ట్విట్ చుసిన నెటిజన్లు.. చంద్రబాబు, నారా లోకేష్ పై తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ ట్విట్ కి ముందు.. మరో సంచలన సెటైరికల్ ట్విట్ కూడా చేశారు విజయసాయి రెడ్డి. ఆ ట్విట్ పై కూడా సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. దీంతో ఈ ట్విట్లు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి. నెటిజన్లు కూడా అమరావతి నిరసనలతో టీడీపీ నేతలు చేసే తప్పులను ఈ ట్విట్ల కామెంట్లలో పెడుతున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: