స్విట్జ‌ర్లాండ్‌లోని దావోస్‌లో జ‌రుగుతున్న స‌మావేశాల్లో వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కే. తారకరామారావు బిజీబిజీగా త‌న కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తున్నారు. రెండవ రోజు దావోస్ పర్యటనలో భాగంగా  పలు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీనియర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు.  దావోస్‌లో పిరామ‌ల్ సంస్థ చైర్మ‌న్ అజ‌య్ పిరామల్‌తో .. తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. దావోస్‌లో ఉన్న తెలంగాణ పెవీలియ‌న్ వ‌ద్ద పిరామ‌ల్ సంస్థ‌తో మంత్రి కేటీఆర్ అనేక సంప్ర‌దింపులు జ‌రిపారు. అయితే రానున్న మూడేళ్ల‌లో తెలంగాణ‌లో 500 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు పిరామ‌ల్ సంస్థ అంగీక‌రించింది.

 

అనంత‌రం జ‌రిగిన‌ బిజినెస్ మీటింగ్‌లో గూగుల్  ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్‌తో  కేటీఆర్ సమావేశం అయ్యారు. హైదరాబాద్ నగరంలో గూగుల్ కార్యకలాపాలతో పాటు, దాని  భవిష్యత్తు విస్తరణ పైన ఈ సందర్భంగా చర్చించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు ప్ర‌తిపాద‌న‌లు గూగుల్ సీఈఓ ముందు ఉంచిన‌ట్లు స‌మాచారం. అనంత‌రం ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ కంపెనీ ఆయిన బే సిస్టమ్స్   చైర్మన్ సర్ రోజర్ కార్ ని మంత్రి కేటీఆర్ ని కలిశారు. తెలంగాణ రాష్ట్రానికి ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగాలు ప్రాధాన్యత రంగాలని చైర్మన్ కు కేటీఆర్ తెలియజేశారు. ఇప్పటికే అనేక ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీలు హైదరాబాద్ నుంచి తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయాన్ని వివరించారు. 

 


రాక్ వెల్ అటోమేషన్ సియివో ప్రెసిడెంట్ బ్లేక్ డి మారెట్, కెటియార్ ను కలిసారు. 230 సంవత్సరాల చరిత్ర కలిగిన జపాన్ ఫార్మా దిగ్గజం టకెడా ఫార్మా వాక్సిన్ బిజినెస్ యూనిట్ అధ్యక్షులు రాజీవ్ వెంకయ్య తో కూడా కేటీఆర్ సమావేశం అయ్యారు.  హైదరాబాద్ ఇండియా యొక్క లైఫ్ సైన్సెస్ ఫార్మా రంగ రాజధానిగా ఉన్నదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించారు. అంతేకాక మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ కె గోయాంక,  కె పి ఎం జి గ్లోబల్ చైర్మన్ మరియు సిఈవో బిల్ థామస్, హెచ్ సీ ల్ టెక్నాలజీస్ సిటివో కళ్యాణ్ కుమార్ లతో కూడా కేటీఆర్ సమావేశం అయ్యారు. 

 

కాగా, దావోస్ లో పర్యటిస్తున్న పారిశ్రామిక, ప్రభుత్వ వర్గాలకు తెలంగాణ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దావోస్ పట్టణంలోని ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఏర్పాటుచేసిన ఈ పెవిలియన్ ను అనేక మంది ప్రముఖులు సందర్శిస్తున్నారు. భారతదేశం నుంచి తెలంగాణతోపాటు కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు మాత్రమే ప్రత్యేక పెవిలియన్లను ఏర్పాటు చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: