ప్రేమ.. ఎప్పుడు.. ఎవరి మధ్య.. ఎలా పుడుతుందో.. చెప్పడం చాలా కష్టం. అయితే ఓ 60 ఏళ్ల బామ్మతో 22 ఏళ్ల యువకుడు ప్రేమాయణం సాగించాడు. ఈ నేపథ్యంలోనే హరిహరాదులు అడ్డొచ్చినా తమను వేరుచేయలేరని ఇద్దరూ ఫిక్స్అయిపోయాడు. అంతేనా అంటే కాదండోయ్.. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవడానికి రెడీ అయి పారిపోదామని కూడా అనుకున్నారట. వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. అయితే ఈ కథలోనే మరెన్నో ట్విస్టులు ఉన్నాయండోయ్. మరి ఆ ట్విస్టులు ఏంటో తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లిపోందాం. ఆగ్రాకు చెందిన 60 ఏళ్ల బామ్మకు భర్తతో సాటే ఏడుగురు కుమారులు, ఏడుగురు మనవళ్లు కూడా ఉన్నారు.
మరో విషయం ఏంటంటే.. రెండు నెలల క్రితమే అమ్మమ్మ కూడా అయ్యింది. అయితే ఎట్మదుద్దౌలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రకాశ్నగర్కు చెందిన 22 ఏళ్ల యువకుడు.. ఆ బామ్మను చూసిన తొలి చూపులోనే ప్రేమలో పడిపోయాడు. ఆమె కూడా అతడిపై మనసు పారేసుకుంది. ఇంకేముంది.. బామ్మకు ప్రపోజ్ చేశాడు. కట్ చేస్తే ఇద్దరూ వీరి ప్రేమకు ఎవరూ ఒప్పుకోరని గ్రహించి పారిపోదామనుకున్నారు. అయితే ఈ విషయం కాస్తా వారిద్దరి ఇళ్లల్లో తెలవడంతో పోలీస్ కేసు వరకూ వెళ్లింది. వీళ్ల కథ విన్న పోలీసులు తొలుత విస్తుపోయారు.
దీంతో రెండు కుటుంబాలు పోలీస్ స్టేషన్కు చేరుకోగా గొడవ మొదలైంది. తాను అతడినే పెళ్లి చేసుకుంటానని బామ్మ, ఆమెను తప్ప మరెవరినీ చేసుకునేది లేదని యువకుడు పట్టుబట్టారు. ఇది చూసిన పోలీసులు తలలు పట్టుకున్నారు. లాభం లేదని ఇద్దరినీ కూర్చోబెట్టి అలా కుదరదని మంచి మాటలు చెబుతూ మనసులు మార్చే ప్రయత్నం చేశారు. ఎవరు ఎంతగా చెప్పినప్పటికీ వారు మాత్రం ససేమిరా కుదరదని తేల్చి చెప్పారు. దీంతో ఏం చేయాలో పాలుపోని పోలీసులు బామ్మ భర్త ఫిర్యాదుతో ఆ యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం వీరి ప్రేమ గాద సోషల్ మీడియాలో వైరల్గా మారింది.