పోసాని కృష్ణ మురళి ఒకపక్క రాజకీయంగాను మరోపక్క సినిమా పరంగా గాను తనదైన శైలిలో రెండు రంగాలలో రాణిస్తున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలకంగా ఉన్న పోసాని కృష్ణ మురళిపార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావటం ప్రస్తుతం వైసీపీ పార్టీలో రాణిస్తున్నారు. జగన్ పాదయాత్రలో ఎన్నికల ప్రచారంలో వైసిపి పార్టీ తరఫున ప్రచారం చేసిన పోసాని జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతి విషయంలో వైసీపీ పార్టీ పొలిటిషన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ కమెడియన్ పృథ్వి చేసిన వ్యాఖ్యలను ఖండించడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి ఇటీవల ఓ ప్రముఖ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...చిరంజీవి కూతురు పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

టిడిపి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఫస్ట్ నుండి చిరంజీవి ఫ్యామిలీ ని టార్గెట్ చేశారని...చిరంజీవి పాలిటిక్స్ లో అడుగు పెట్టాలని అనుకుంటున్న అప్పటినుండి మెగా ఫ్యామిలీ ని గట్టిగా టార్గెట్ చేశారని పేర్కొన్నారు. అయితే చిరంజీవి రాజకీయాల్లో అడుగు పెట్టాక చంద్రబాబు ఏం చేయాలి ? తాను బాగా అభివృద్ధి చేస్తాను.. నేను ప్రవేశపెట్టబోయే పథకాలు ఇవి అని ప్రజలని ఒప్పించి ఓట్లు అడగాలి. కానీ ఆయన ఏం చేశారు.. చిరంజీవి మంచి వాడు కాదు అని ముద్ర వేయడానికి ప్రయత్నించారు. చివరికి చిరంజీవి కుమార్తె ప్రేమ వివాహంలో కూడా కుట్ర పన్నారు.

 

ఇంట్లో ఆడవాళ్ళని కాపాడుకోలేని వ్యక్తి.. రాష్ట్రాన్ని ఏం కాపాడుతాడు అంతో టిడిపి లీడర్ల చేత ప్రచారం చేయించారుఅని పోసాని మండిపడ్డారు. తన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు అని మరచిపోయి చిరంజీవి ఫ్యామిలీపై చంద్రబాబు విమర్శల దాడి చేయించారు. చిరంజీవి సున్నితమైన వ్యక్తి. కాబట్టి ఎన్ని అన్నా పడతాడు అని ఇలా దాడి చేయించినట్లు పోసాని చెప్పుకొచ్చారు. మొత్తం మీద చిరంజీవిని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి చిరంజీవి కూతురు పెళ్లి కుట్రగా చంద్రబాబు తెరకెక్కించినట్లు పోసాని మీడియా సమావేశంలో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: